15 సార్లు ఎన్నికలు.. నలుగురే మహిళలు
అతివల్ని ఆకాశంలో సగం అంటూ పొగడటమే తప్ప ప్రజాప్రతినిధులుగా పోటీచేసే అవకాశం కల్పించింది తక్కువే. నర్సాపూర్ నియోజకవర్గంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ. కానీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వస్తున్న అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి.
అతివల్ని ఆకాశంలో సగం అంటూ పొగడటమే తప్ప ప్రజాప్రతినిధులుగా పోటీచేసే అవకాశం కల్పించింది తక్కువే. నర్సాపూర్ నియోజకవర్గంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ. కానీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వస్తున్న అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. నర్సాపూర్ నియోజకవర్గం 1952 ఎన్నికల నాటికి ఆవిర్భవించింది. ఇంతవరకు ఇక్కడ 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 15 ఎన్నికల్లో మొత్తం నలుగురే మహిళలు పోటీకి నిలిచారు. వీరిలో గెలుపొందింది సునీతారెడ్డి ఒక్కరే కావడం గమనార్హం. ఆమె వరుసగా మూడుసార్లు గెలుపొంది తన ప్రత్యేకతను చాటారు. 1952, 1957, 1962, 1967, 1972, 1978, 1983, 1985, 1989, 1994ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యమే లేదు. 1999ఎన్నికల నాటికి అనూహ్యంగా సునీతారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె వరుసగా 1999, 2004, 2009, 2014, 2018 ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. 1999, 2004, 2009ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 2009 ఎన్నికల్లో పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా లక్ష్మి, 2014 ఎన్నికల్లో సీపీఎం తరఫున కండపల్లి లక్ష్మీబాయి, 2018 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి సోమన్నగారి లక్ష్మీ పోటీకి నిలిచారు.
న్యూస్టుడే, నర్సాపూర్
కల్యాణ వేదిక.. ఎన్నికల వేడిక
తూప్రాన్లో ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల నాయకులు తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. తూప్రాన్ మండల కేంద్రంలో ప్రధాన పార్టీల నాయకులు నెల రోజుల పాటు వేడుక మందిరాలను అద్దెకు తీసుకుని అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భారాస, కాంగ్రెస్, భాజపా ఇలా మూడు ప్రధాన పార్టీల నాయకులు అక్కడి నుంచే తమ ప్రచారాలను ప్రారంభిస్తున్నారు. మధ్యాహ్నం కార్యకర్తలకు, నాయకులకు, ర్యాలీకి వచ్చే ఇతరులకు భోజనాలు పెడుతున్నారు. ఒక్కో ఫంక్షన్ హాల్ను నెల రోజులకు రూ.ఐదు నుంచి రూ.పది లక్షల వరకు అద్దెకు మాట్లాడుకున్నారు. పట్టణంలో ప్రధాన పార్టీల నాయకులు కార్యకర్తలతో ఫంక్షన్ హాల్ వద్ద సందడి నెలకొంది.
న్యూస్టుడే, తూప్రాన్
అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం
మెదక్... రాచవీడు ప్రాంతం నుంచి జిల్లా కేంద్రంగా మారింది. 1952లో నియోజకవర్గం ఏర్పడగా ఇప్పటి వరకు పది మంది శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయా మండలాలు, పట్టణానికి చెందిన వారు కావడంతో అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిథ్యం వహించడం విశేషం. 1952లో తొలి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకటేశ్వర్రావు (కాంగ్రెస్) మెదక్ పట్టణం బ్రాహ్మణవీధికి చెందిన వారు. తిరిగి ఆయనే 1957లో విజయం సాధించారు. ఆ తర్వాత సీపీఐ తరఫున గెలిచిన ఆనందాదేవి మెదక్ పట్టణవాసి. 1967లో ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంచంద్రారెడ్డి సంగారెడ్డి జిల్లా జోగిపేట స్వస్థలం. ఆ తర్వాత వరుసగా 2004 వరకు జరిగిన ఎన్నికల్లో పాపన్నపేట మండలానికి చెందిన వారు ఎన్నికవుతూ వచ్చారు. 1972లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కరణం రామచంద్రరావుది పాపన్నపేట మండలం కొత్తపల్లి. ఈయన ఇక్కడి నుంచి ఐదు సార్లు గెలుపొందారు. 1989లో గెలిచిన పట్లోళ్ల నారాయణరెడ్డి, 2004లో జనతా పార్టీ నుంచి గెలుపొందిన పట్లోళ్ల శశిధర్రెడ్డిలది పాపన్నపేట మండలం యూసుఫ్పేట. 2002లో జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించిన కరణం ఉమాదేవి స్వగ్రామం కొత్తపల్లి. ఇక చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లికి చెందిన మైనంపల్లి హన్మంతరావు 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014, 2018లో గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి స్వస్థలం రామాయంపేట మండలం కోనాపూర్.
- న్యూస్టుడే, మెదక్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర భారతంలో ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని ఉక్కుమనిషి
ఉక్కు మనిషి అన్న పదం వినగానే ఆబాలగోపాలానికి గుర్తుకొచ్చే పేరు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ప్రధాని హోదాలో కేంద్ర హోం, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారాయన. -
ఆస్ట్రేలియాలో పండగలా పోలింగ్
ఆస్ట్రేలియాలో నిర్బంధ ఓటింగ్ అమల్లో ఉంది. అక్కడి ప్రజలు ఓటు వేయడాన్ని శ్రమగా భావించరు. సంతోషంగా ఓటేస్తూ.. పోలింగ్ను పండగలా నిర్వహించుకుంటారు. -
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్ చట్టం అమలవుతోంది. తొలిసారిగా 1912లో ఇక్కడ పురుషులకు ఓటింగ్ను తప్పనిసరి చేశారు. -
టమాటా పప్పు.. కోడిగుడ్డు కూర.. పోలింగ్ సిబ్బందికి మెనూ ఇదే!
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. -
ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు!
తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత తాము అనుకున్న అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
ఆన్లైన్లో ఓటర్ స్లిప్... డౌన్లోడ్ చేసుకోండిలా!
Voter Slip Download Options: ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ కచ్చితంగా అవసరం. మీ కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏమౌతుందిలే అనుకునేవారు చరిత్ర గతిని మార్చిన ‘ఒక్క ఓటు’ ఉదంతాలు తెలుసుకోవాల్సిందే. -
ఎంపీగా ఎన్నికైతేే జీతం ఎంతో తెలుసా?
ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. -
లష్కర్ నుంచి ఎన్నికయ్యారు.. కేంద్రంలో మంత్రులయ్యారు
సికింద్రాబాద్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన నలుగురు నేతలకు కేంద్ర మంత్రులుగా పనిచేసే అవకాశం దక్కడం విశేషం. 1979 ఉప ఎన్నికలు, 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన పి.శివశంకర్.. -
వారి ఓటును వారికి వేసుకోలేరు!
అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు వారి ఓటును వారికి వేసుకోలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొందరికి ఇదే పునరావృతం కానుంది.ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉంది. దీంతో తమ పార్టీకి, కొన్నిచోట్ల ఇతర పార్టీలకు ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఓటు.. సుదీర్ఘ ప్రయాణం
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక పౌరులందరికీ సార్వత్రిక ఓటును వినియోగించుకునే కల సాకారమైంది. -
రూ.2తో ఓటు ఛాలెంజ్
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?
పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. -
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?