స్వతంత్రం.. జయకేతనం
ఎన్నికల్లో పార్టీల టికెట్లు ఆశించే ఆశావహులు ఎంతో మంది ఉంటారు. పార్టీ గుర్తుపై పోటీ చేస్తే విజయం సాధించడం సులభమని భావిస్తుంటారు.
ప్రధాన అభ్యర్థులకు ఝలక్
న్యూస్టుడే, చేగుంట: ఎన్నికల్లో పార్టీల టికెట్లు ఆశించే ఆశావహులు ఎంతో మంది ఉంటారు. పార్టీ గుర్తుపై పోటీ చేస్తే విజయం సాధించడం సులభమని భావిస్తుంటారు. ఇందుకు పార్టీలో ఉండి టికెట్టు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటారు. ఒకవేళ టికెట్ ఇవ్వని పక్షంలో స్వతంత్రులుగా రంగంలోకి దిగి విజయకేతనం ఎగరవేశారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఎంతోమంది గెలుపు అందుకొని తమ సత్తా చాటారు. 13 మంది ఇలా విజయాలు అందుకున్నారు.
1962
గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు జి.వెంకటస్వామి పోటీ చేయగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సైదయ్య 1027 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
- సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీ రాజేశ్వర్రావుపై స్వతంత్రుడిగా పోటీ చేసిన సోమేశ్వర్రావు విజయకేతనం ఎగరవేశారు.
- కొడంగల్ నియోజకవర్గంలో 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇల్లరి బసప్పపై రుక్మారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.
1972
మెదక్ నియోజకవర్గం నుంచి కరణం రామచందర్రావు స్వతంత్ర అభ్యర్థిగా విజయం అందుకున్నారు.
- నారాయణఖేడ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వెంకట్రెడ్డి గెలుపొందారు.
- నందారం వెంకటయ్య గెలుపు అందుకున్నారు.
1952
సంగారెడ్డి నియోజకవర్గంలో ఏకంగా నలుగురు స్వతంత్రులు గెలుపొందారు. కృష్ణమాచారి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జీఆర్ రెడ్డిపై 2654 ఓట్ల ఆధిక్యంతో విజయం పొందారు.
రాజగోపాల్పేట నుంచి స్వతంత్రుడిగా పోటీ చేసిన కేవీ నారాయణరెడ్డి విజయం సాధించారు.
అందోలు నుంచి శరత్గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దత్తాత్రేయరావుపై 7,181 ఓట్లతో గెలుపొందారు.
1967
దొమ్మాట నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన ఖాజా మోహినొద్దీన్పై స్వతంత్రుడు మ్యాడ భీంరెడ్డి 2749 ఓట్లతో విజయం సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థి పి.రామచంద్రారెడ్డిపై స్వతంత్రుడు నర్సింహారెడ్డి 2065 ఓట్లతో గెలుపు సాధించారు.
1978
జనతా పార్టీ తరఫున పి.రామచంద్రారెడ్డి బరిలోకి దిగగా.. నర్సింహారెడ్డి 19,210 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
1983
కాంగ్రెస్ అభ్యర్థి పి.వీరారెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్రారెడ్డి 5705 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2004
మెదక్ నుంచి జనతా పార్టీ తరఫున బరిలోకి దిగిన పట్లోళ్ల శశిధర్రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర భారతంలో ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని ఉక్కుమనిషి
ఉక్కు మనిషి అన్న పదం వినగానే ఆబాలగోపాలానికి గుర్తుకొచ్చే పేరు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ప్రధాని హోదాలో కేంద్ర హోం, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారాయన. -
ఆస్ట్రేలియాలో పండగలా పోలింగ్
ఆస్ట్రేలియాలో నిర్బంధ ఓటింగ్ అమల్లో ఉంది. అక్కడి ప్రజలు ఓటు వేయడాన్ని శ్రమగా భావించరు. సంతోషంగా ఓటేస్తూ.. పోలింగ్ను పండగలా నిర్వహించుకుంటారు. -
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్ చట్టం అమలవుతోంది. తొలిసారిగా 1912లో ఇక్కడ పురుషులకు ఓటింగ్ను తప్పనిసరి చేశారు. -
టమాటా పప్పు.. కోడిగుడ్డు కూర.. పోలింగ్ సిబ్బందికి మెనూ ఇదే!
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. -
ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు!
తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత తాము అనుకున్న అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
ఆన్లైన్లో ఓటర్ స్లిప్... డౌన్లోడ్ చేసుకోండిలా!
Voter Slip Download Options: ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ కచ్చితంగా అవసరం. మీ కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏమౌతుందిలే అనుకునేవారు చరిత్ర గతిని మార్చిన ‘ఒక్క ఓటు’ ఉదంతాలు తెలుసుకోవాల్సిందే. -
ఎంపీగా ఎన్నికైతేే జీతం ఎంతో తెలుసా?
ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. -
లష్కర్ నుంచి ఎన్నికయ్యారు.. కేంద్రంలో మంత్రులయ్యారు
సికింద్రాబాద్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన నలుగురు నేతలకు కేంద్ర మంత్రులుగా పనిచేసే అవకాశం దక్కడం విశేషం. 1979 ఉప ఎన్నికలు, 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన పి.శివశంకర్.. -
వారి ఓటును వారికి వేసుకోలేరు!
అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు వారి ఓటును వారికి వేసుకోలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొందరికి ఇదే పునరావృతం కానుంది.ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉంది. దీంతో తమ పార్టీకి, కొన్నిచోట్ల ఇతర పార్టీలకు ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఓటు.. సుదీర్ఘ ప్రయాణం
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక పౌరులందరికీ సార్వత్రిక ఓటును వినియోగించుకునే కల సాకారమైంది. -
రూ.2తో ఓటు ఛాలెంజ్
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?
పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. -
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.