Re Polling: ఆ తొమ్మిదింట్లో సంతృప్తి చెందకపోతే.. రీ పోలింగ్..
ఎన్నికల ప్రక్రియలో తొమ్మిది అంశాలు కీలకం. వీటిలో ఎన్నికల పరిశీలకుడు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక నిర్వహణ తీరులో సంతృప్తి చెందకపోతే ఆ పోలింగ్ కేంద్రాలలో రీ పోలింగ్కు ఆదేశాలు జారీ చేయొచ్చు.
ఈనాడు డిజిటల్, సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్టుడే: ఎన్నికల ప్రక్రియలో తొమ్మిది అంశాలు కీలకం. వీటిలో ఎన్నికల పరిశీలకుడు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక నిర్వహణ తీరులో సంతృప్తి చెందకపోతే ఆ పోలింగ్ కేంద్రాలలో రీ పోలింగ్కు ఆదేశాలు జారీ చేయొచ్చు. పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చిన ప్రతి ఓటరు వివరాలు, గుర్తింపు కార్డు, తదితర అంశాలను పోలింగ్ కేంద్రంలో నమోదు చేయనున్నారు. పోలింగ్ పూర్తయిన అనంతరం ఏదైన ఫిర్యాదులు వెళ్లినట్లయితే ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పరిశీలకుడు సమీక్ష చేస్తారు. అందులో ఆ అధికారికి ఎలాంటి సందేహం కలిగినా, ఫిర్యాదు వచ్చిన పోలింగ్ కేంద్రంలోనే రీ పోలింగ్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేస్తారు.
అందుకు సంబంధించిన అర్హతలు
తిరిగి పోలింగ్ నిర్వహించేందుకు కావాల్సిన పత్రాలలో ముఖ్యంగా ఫాం 17-ఏ కావాల్సి ఉంది. దీని ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లు లేదా వారి ప్రతినిధులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ దరఖాస్తును పరిశీలకులు, రిటర్నింగ్ అధికారికి అందించినట్లయితే వారు ఎన్నికల పరిశీలకులకు సమర్పిస్తారు. అభ్యర్థులు చేసిన ఫిర్యాదులను పరిశీలించనున్నారు. ప్రధానంగా తొమ్మిది వరకు ఫిర్యాదులను తీసుకుని తదుపరి ప్రక్రియను నిర్వహించనున్నారు.
తొమ్మిది అంశాలు ఇలా...
1) అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియలో అబ్జర్వర్, డీఈవో లేదా ఆర్వోల ద్వారా ఏదైనా రిగ్గింగ్, ఏవైనా అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు అందితే పరిశీలిస్తారు.
2) ఏదైనా ముఖ్యమైన సంఘటన ఈవీఎం, వీవీప్యాÆట్లకు సంబంధించిన, ఇతరత్రా జరిగిన పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల ప్రక్రియ సమయంలో పరిశీలకుడు, డీఈవో లేదా ఆర్వోకి నివేదించినప్పుడు.
3) పోలింగ్ కేంద్రంలో ఏ పోలింగ్ ఏజెంట్ లేనప్పుడు, ఒకే ఒక అభ్యర్థి ఏజెంట్ సమక్షంలో పోలింగ్ జరిగిన సందర్భాల్లో.
4) పోలింగ్ స్టేషన్లో ఈపీఐసీ(కమిషన్ పేర్కొన్న ప్రత్యామ్నాయ పత్రాలు) కాకుండా ఇతర పత్రాలను ఉపయోగించి ఓటు వేసిన ఓటర్ల సంఖ్య ఆ పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్లలో 25శాతం మించిపోయినప్పుడు.
5) ఏఎస్డీగా గుర్తించిన 10శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు హాజరై ఓటు వేసిన పోలింగ్ కేంద్రాలలో.
6) పోలింగ్ కేంద్రాలలో ఆ ఏసీ సగటు పోలింగ్ శాతం కంటే పోలింగ్ 15శాతం లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు.
7) పోలింగ్ స్టేషన్లలో కనీసం ఐదు టెండర్ వేసిన ఓటు,్ల సవాలు చేసిన ఓట్లు నివేదించిన సందర్భాల్లో.
8) పోలింగ్ కేంద్రంలో ఓటర్ల రిజిస్టర్ (ఫారం-17ఏ) 10శాతం, అంతకంటే ఎక్కువ రిమార్కులు నిర్దేశించిన కాలమ్స్ ఖాళీగా ఉన్నప్పటికీ ఈపీˆఐసీˆ ప్రత్యామ్నాయ పత్రాన్ని ఉపయోగించినప్పుడు.
9) మైక్రో అబ్జర్వర్ ప్రతికూల నివేదికను సమర్పించిన పోలింగ్ కేంద్రాలలో.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
లోక్సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ మొదలైన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో పలు వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. -
ఇంటి నుంచి ఓటు.. అర్హులు ఎవరు? దరఖాస్తు ఎలా?
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. -
General elections: నేను ఫలానా వారి భార్యను!
భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది. -
డిపాజిట్ గల్లంతైనా పోటీకి సై
లోక్సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు. -
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్ హిట్లర్ను జాన్.ఎఫ్. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ?
తాజా వార్తలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!