శతాబ్దాల కిందటి పరిమళాన్ని కనుగొంటారట!
గడిచిన కాలాన్ని తిరిగి వెనక్కి తీసుకురాలేం. చరిత్రను తిరగరాయలేం. కానీ, కొన్ని శతాబ్దాల కిందట ఏం జరిగింది?అప్పటి వ్యక్తుల జీవనం ఎలా ఉండేదనే విషయాలను చరిత్ర పుస్తకాల ద్వారా, సినిమాల ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ, ఆ కాలంలో పరిమళం
ఇంటర్నెట్ డెస్క్: గడిచిన కాలాన్ని తిరిగి వెనక్కి తీసుకురాలేం. చరిత్రను తిరగరాయలేం. అయితే, కొన్ని శతాబ్దాల కిందట ఏం జరిగింది? అప్పటి వ్యక్తుల జీవనం ఎలా ఉండేదనే విషయాలను చరిత్ర పుస్తకాలు, సినిమాల ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ, ఆ కాలంలో పరిమళం ఎలా ఉండేదో తెలుసా? అదేలా సాధ్యం.. గత కాలపు పరిమళం మనకెలా తెలుస్తుంది అంటారా? దాన్ని సాధ్యం చేయాలని పలువురు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఓ ప్రాజెక్టును చేపట్టారు.
అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రాచీన చరిత్ర గల ప్రాంతాల్లో ఐరోపా ఒకటి. చరిత్రకారులు యూరప్ చరిత్రను భద్రపరుస్తూ, భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ వస్తున్నారు. అయితే, తాజాగా శాస్త్రవేత్తలు, కృత్రిమ మేధ, పరిమళాల నిపుణులతో కలిసి ప్రాచీన కాలంలో యూరప్ వ్యాప్తంగా ఎలాంటి పరిమళం వచ్చేదో తెలుసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘ఒడురొపా’ పేరుతో ఓ ప్రాజెక్టు ప్రారంభించారు. చరిత్రను తెరిచి చూస్తే కాలంతోపాటు మనుషుల జీవన విధానం ఎంతో మారిపోయింది. ఒకప్పుడు వ్యవసాయం మాత్రమే ఉండేది.. ఆ తర్వాత పరిశ్రమలు, కంపెనీలు, ఇతరత్రా ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో సమాజంతోపాటు గాలిలోని పరిమళం కూడా మారుతూ వచ్చింది.
అలా 16వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం అర్ధభాగం వరకు యూరప్లోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి పరిమళం ఉండేదో కనిపెట్టి ఇప్పటి ప్రజలకు తెలపాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ‘చరిత్రలోని ప్రతి దశకు ఓ ప్రత్యేకమైన పరిమళం ఉంది. వాటిని ప్రజలకు పరిచయం చేస్తే.. వారు చరిత్రను చూడటంతోపాటు అప్పటి పరిమళాన్ని ఆస్వాదించగలరని, అలాగే ప్రస్తుత కాల పరిమళాలపై ఆసక్తి పెరుగుతుందని’ ఒడురొపా బృందంలోని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 2.8మిలియన్ యూరోలు(రూ.25కోట్లు) ఖర్చు చేస్తున్నారు. ఏడు భాషాల్లో ఉన్న యూరప్ సాహిత్యాన్ని తెలుసుకొని అందులో పరిమళాల గురించి ఉన్న సమాచారాన్ని కృత్రిమమేధ ద్వారా సేకరిస్తారట. కనిపెట్టిన పరిమళాలను మ్యూజియం ద్వారా ప్రజలు ఆస్వాదించేలా చేస్తామని నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం