రియాల్టీషో విజేతను అంతరిక్షంలోకి పంపుతారట!
టీవీల్లో ప్రసారమయ్యే రియాల్టీ షోలకు మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇటీవల కాలంలో ఆయా షోల్లో పాల్గొనే పోటీదారులను ఓట్లు వేసి గెలిపించే బాధ్యత టీవీ చూసే ప్రేక్షకులపైనే ఉంటోంది. ప్రేక్షకులు మెచ్చిన విజేతలకు రియాల్టీ షో నిర్వాహకులు లక్షల్లో
ఇంటర్నెట్ డెస్క్: టీవీల్లో ప్రసారమయ్యే రియాల్టీ షోలకు మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇటీవల కాలంలో ఆయా షోల్లో పాల్గొనే పోటీదారులను ఓట్లు వేసి గెలిపించే బాధ్యత టీవీ చూసే ప్రేక్షకులపైనే ఉంటోంది. అలా ప్రేక్షకులు మెచ్చిన విజేతలకు రియాల్టీ షో నిర్వాహకులు రూ.లక్షలు.. కోట్లలో నగదు, కార్లు, బైకులు బహుమతులుగా ఇవ్వడం చూశాం. కానీ, ఓ ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించనున్న రియాల్టీ షోలో విజేతకు ఏకంగా అంతరిక్ష యాత్రను బహుమతిగా ఇవ్వనున్నారట.
స్పేస్ హీరో ఇన్కార్పొరేషన్ అనే అమెరికాకు చెందిన ప్రొడక్షన్ కంపెనీ త్వరలో ‘స్పేస్ హీరో’ పేరుతో ఓ రియాల్టీ షోను ప్రారంభించనుందట. ఈ షో ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పోటీలు పెడతారనే విషయాలు వెల్లడించలేదు. కానీ, 2023లో ఈ షో విజేతను అంతరిక్ష కేంద్రానికి పంపుతామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షయాత్రపై ఆసక్తి ఉన్న అభ్యర్థులను ఒక్కచోటకు చేర్చి అంతరిక్ష కేంద్రంలో ఉండగలరా లేదా అని శారీరక, మానసిక పరీక్షలు నిర్వహిస్తారట. వారి ప్రదర్శన, ప్రేక్షకుల ఓట్లు ఆధారంగా విజేతగా నిలిచిన వారిని పది రోజుల అంతరిక్ష యాత్రకు పంపనున్నారు. యాత్రలో భాగంగా విజేత రాకెట్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లి.. పది రోజులు అక్కడే బస చేసి తిరిగి భూమి మీదకు వస్తారు. ఇందుకోసం ప్రైవేటు స్పేస్ మిషన్ సంస్థ ‘యాక్సివోమ్ స్పేస్’తో స్పేస్ హీరో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో నాసాతో సంప్రదింపులు జరిపి.. ఈ రియాల్టీ షో పూర్తి వివరాలు వెల్లడిస్తారట. ఈ మేరకు స్పేస్ హీరో సంస్థ ప్రకటన విడుదల చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి