AP News: రాజమహేంద్రవరంలో 11 మంది పోలీసులకు కరోనా

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో కరోనా కలకలం...

Published : 09 Jan 2022 22:51 IST

రాజమహేంద్రవరం నేరవార్తలు: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఓ ఎస్సైతోపాటు పలువురు సిబ్బందిలో కరోనా లక్షణాలు కనిపించగా శనివారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో ఓ సీఐ, ఎస్సైతో పాటు తొమ్మిది మంది సిబ్బందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో నలుగురు సిబ్బందిలో లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరంతా సోమవారం వైద్య పరీక్షలు చేయించుకొనేందుకు సిద్ధమవుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని