10లక్షల మందికి అవగాహన కల్పించాం:డీజీపీ
మహిళలతో పాటు ఆడపిల్లల సైబర్ భద్రతే లక్ష్యంగా ఈ-రక్షాబంధన్ కార్యక్రమం చేపట్టామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ఈ-రక్షాబంధన్ ముగింపు సందర్భంగా ....
అమరావతి: మహిళలతో పాటు ఆడపిల్లల సైబర్ భద్రతే లక్ష్యంగా ఈ-రక్షాబంధన్ కార్యక్రమం చేపట్టామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ఈ-రక్షాబంధన్ ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ మాట్లాడారు. ప్రస్తుత కరోనా కాలంలో ఆన్లైన్ వేదికను విస్తృతంగా వినియోగిస్తున్న పరిస్థితుల్లో సైబర్ భద్రతకు పెద్దపీట వేశామన్నారు. ఆడపిల్లలకు ఏ ఇబ్బంది వచ్చినా పోలీసు వ్యవస్థ వెంటనే స్పందించేలా ‘దిశ’ చట్టంతో ఇప్పటికే ముందడుగు వేసినట్లు వివరించారు. ఈ-రక్షాబంధన్ కార్యక్రమం ద్వారా సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 10లక్షల మందికి అవగాహన కల్పించినట్లు డీజీపీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి సమంత, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, క్రికెటర్ కల్పనతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ప్రజలను చైతన్య పరచడం మంచి పరిణామం: సమంత
చిన్నారులు, మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ఈ-రక్షాబంధన్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని ప్రముఖ సినీనటి సమంత అన్నారు. ముగింపు కార్యక్రమంలో వెబినార్ ద్వారా ఆమె పాల్గొని సందేశాన్ని ఇచ్చారు. ఆన్లైన్లో ట్రోలింగ్, స్టాకింగ్లాంటి వేధింపులు చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా నెలరోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరచడం మంచి పరిణామమన్నారు.
మహిళలపై జరుగుతున్న సైబర్ వేధింపులపై ఈ-రక్షాబంధన్లో చక్కగా వివరించారని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, క్రికెటర్ కల్పన అన్నారు. మారుమూల ప్రాంతాల యువతులు, చిన్నారులు, మహిళలు ఈ కార్యక్రమాన్ని వీక్షించటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కరోనా సమయంలో ఇంట్లో ఉంటూ నిత్యం పాఠశాల తరగతుల్లోలాగే ఈ-రక్షాబంధన్ కార్యక్రమాన్ని వీక్షించారన్నారు. ఫేక్ ఐడీలు, ఫేక్ న్యూస్లను గుర్తించటం, డిజిటల్ అడిక్షన్, ఎటువంటి వీడియోలను డౌన్ లోడ్ చేయాలి తదితర అంశాలపై సైబర్ నిపుణులు అవగాహన కల్పించారని విద్యార్థినులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..