ఆ కేసు విచారణలో ముందుకెళ్లొద్దు:ఏపీ హైకోర్టు
ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకుంటూ ఉద్యోగులపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ దాఖలు
అమరావతి: ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకుంటూ ఉద్యోగులపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణ ప్రక్రియలో ముందుకెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల కమిషన్, అందులో పనిచేస్తున్న ఉద్యోగులను వేధించడానికి కేసు నమోదు చేశారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. కేసు నమోదు ద్వారా ఎన్నికల కమిషన్ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్నారు.
ఎన్నికల సంఘం సిబ్బంది వినియోగించిన కంప్యూటర్లోని సమాచారాన్ని సీఐడీ అధికారులు తీసుకెళ్లారని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పనిచేయకుండా ఉన్న కంప్యూటర్ను ఫార్మాట్ చేసినందుకు సాంబమూర్తి అనే ఉద్యోగిని సీఐడీ వేధిస్తోందని చెప్పారు. తీసుకెళ్లిన వస్తువులను తిరిగి అప్పగించేలా సీఐడీని ఆదేశించాలని కోర్టును కోరారు. సీఐడీ కేసు నమోదు చేసిన వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ .. ఎవరిపై కేసు నమోదు చేశారు ? ఎవరిని విచారిస్తున్నారు అని ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు కేసు విచారణ ప్రక్రియలో ముందుకు వెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది .
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్