మొక్కలు నాటిన ఎంపీ అసదుద్దీన్‌

తెరాస రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన 3వ విడత గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

Published : 24 Aug 2020 00:37 IST

హైదరాబాద్‌: తెరాస రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన 3వ విడత గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒక మంచి కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు అసదుద్దీన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని