‘పాఠ్యాంశాల తొలగింపు ప్రతిపాదన మాత్రమే’
ఇంటర్మీడియట్ ఆర్ట్స్ గ్రూపుల్లో సిలబస్ తొలగింపు గందరగోళంగా మారింది. చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం తదితర సబ్జెక్టుల్లో కొన్ని పాఠ్యాంశాల తొలగింపుపై వివాదం నెలకొంది. స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్తలకు...
వివరణ ఇచ్చిన తెలంగాణ ఇంటర్బోర్డు
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఆర్ట్స్ గ్రూపుల్లో సిలబస్ తొలగింపు గందరగోళంగా మారింది. చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం తదితర సబ్జెక్టుల్లో కొన్ని పాఠ్యాంశాల తొలగింపుపై వివాదం నెలకొంది. స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్తలకు సంబంధించిన పాఠాల తొలగింపుపై విమర్శలు వచ్చాయి. దీంతో ఇంటర్మీడియట్ బోర్డు వెనక్కి తగ్గింది. పాఠాల తొలగింపు ప్రతిపాదన మాత్రమేనని.. ఇంకా పరిశీలనలోనే ఉన్నాయని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వివరణ ఇచ్చారు. జాతీయ నేతలు, సంఘ సంస్కర్తలు, ప్రముఖులపై పాఠాలు తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కరోనా పరిస్థితుల వల్ల నాలుగు నెలలు వృథా అయినందున 30శాతం సిలబస్ కుదింపునకు ప్రభుత్వం అంగీకరించిందని జలీల్ తెలిపారు. హ్యుమానిటీస్ గ్రూపుల్లో పాఠాల తొలగింపుపై నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నిపుణుల కమిటీలు కొన్ని పాఠాల తొలగింపునకు సిఫార్సు చేశాయన్నారు. అయితే, ఆ సిఫార్సులపై చర్చించి ఆమోదించాల్సి ఉందన్నారు. సైన్స్ గ్రూపులకు సంబంధించిన పాఠాలు సీబీఎస్ఈ సూచనల ప్రకారమే తొలగించినట్టు ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం