MUlugu: జంపన్న వాగులో గల్లంతైన మొత్తం 8మంది మృతదేహాలు లభ్యం
ములుగు జిల్లాలో వరదల్లో గల్లంతైన వారిలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏటూరునాగారం మండలం కొండాయిలో ఉన్న జంపన్న వాగులో గురువారం ఎనిమిది మంది గల్లంతయ్యారు.
ఏటూరునాగారం: ములుగు జిల్లాలో వరదల్లో గల్లంతైన వారిలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏటూరునాగారం మండలం కొండాయిలో ఉన్న జంపన్న వాగులో గురువారం ఎనిమిది మంది గల్లంతయ్యారు. శుక్రవారం ఉదయం తాడ్వాయి మండలం మేడారం వద్ద వరదలో ఐదుగురి మృతదేహాలు గుర్తించారు. సాయంత్రం కొండాయి సమీపంలో జంపన్న వాగులో మరో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. కొండాయి గ్రామంలో జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చి.. ఆ గ్రామాన్ని ముంచెత్తడంతో ఎనిమిదిమంది వరద నీటిలో చిక్కుకుని గల్లంతయ్యారు. గాలింపు చేపట్టిన సహాయక బృందాలను గల్లంతైన వారి మృతదేహాలను గుర్తించాయి.
ఇంకా జలదిగ్బంధంలోనే కొండాయి గ్రామం
జంపన్నవాగు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఏటూరునాగారం మండలంలోని చాలా గ్రామాలను ముంచెత్తింది. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కొండాయి గ్రామంతో పాటు, మల్యాల, దొడ్ల గ్రామాల్లో సైతం పూర్తిగా ఇళ్ల పైకప్పు స్థాయిలో వరద మట్టం చేరింది. ఆయా గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోయారు. హాహాకారాలు చేస్తూ దిక్కు తోచని స్థితిలో ఎవరికి తోచిన దారిన వారు సురక్షిత ప్రాంతాలకు పరుగు తీశారు. ఎటు వెళుతున్నారో తెలియదు, ఎలా ఆశ్రయం పొందాలో తెలియదు.. ఒక్కసారిగా భయాందోళనకు గురై వరద ముంపు నుంచి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఊరి చుట్టూ చేరిన వరద నీరు ఒకేసారిగా ఊరంతా కమ్ముకుపోయి ఏకంగా ఇళ్లను సైతం ముంచి వేసింది. జంపన్నవాగు వరద నుంచి కాపాడేందుకు నిర్మించిన కరకట్ట కూడా తెగిపోయింది. వాగుపై నిర్మించిన వారధి కుంగిపోగా వరద ఉద్ధృతికి బ్రిడ్జి కొట్టుకుపోతుందేమోనన్న భయానికి గురయ్యారు. కొండాయి గ్రామం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. -
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం(ఈసీ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. -
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
జిల్లాలోని చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో సిట్ విచారణ చేపట్టింది. వైకాపా అభ్యర్థి మోహిత్రెడ్డి గన్మెన్ ఈశ్వర్, గ్రామస్థులను అధికారులు విచారించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) (AB Venkateswara Rao)కు పౌరసమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది -
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. -
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
స్థానిక ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో సిట్ బృందం దర్యాప్తు చేసింది. ఇందులో భాగంగా అల్లర్లకు సంబంధించిన వీడియోలను అధికారులు పరిశీలించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 3కి.మీ మేర బారులు
శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగుతోంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, నిండిపోయాయి. -
ఇసుకపై.. డేగకన్ను
ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో గనుల శాఖ అధికారులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన వారంతా గత రెండు రోజులుగా రేవులను పరిశీలించే పనిలో పడ్డారు. -
వంగిపోయారా? లొంగిపోయారా?
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్