Gujarat: వివాహ వేడుకలోనే కరోనా టీకాలు.. ఏఎంసీ వినూత్న కార్యక్రమం!

కరోనా టీకాలు తీసుకోనివారే లక్ష్యంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌(ఏఎమ్‌సీ) వినూత్న ప్రయత్నం చేసింది.

Published : 10 Dec 2021 23:34 IST

అహ్మదాబాద్: కరోనా టీకాలు తీసుకోనివారే లక్ష్యంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌(ఏఎమ్‌సీ) వినూత్న ప్రయత్నం చేసింది. ఏఎమ్‌సీకి చెందిన ఆరోగ్య కార్యకర్తలు.. నగరంలో పెళ్లిళ్లు, ఇతర వేడుకలు జరుగుతున్న వేదికల వద్దకే వెళ్లి టీకాలు వేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లివేడుక వద్దకు వెళ్లిన ఆరోగ్య కార్యకర్తలు.. అతిథుల వ్యాక్సిన్ ధ్రువపత్రాలను పరిశీలించారు. అర్హులై ఉండి ఇంకా టీకాలు తీసుకోనివారికి అక్కడే వ్యాక్సిన్ ఇచ్చారు. ఓ వైపు పెళ్లివేడుక.. మరోవైపు టీకాల పంపిణీ కార్యక్రమం ఒకే సమయంలో జరిగాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని