PV Sindhu: సింధుకు థార్ వాహనం ఇవ్వండి.. ఆనంద్ మహింద్రా అదిరిపోయే రిప్లై
వరుస ఒలింపిక్స్లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది వీపీ సింధు. రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన ఈ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.. తాజా టోక్యో విశ్వక్రీడల్లో కాంస్యంతో మెరిసింది....
ఇంటర్నెట్ డెస్క్: వరుస ఒలింపిక్స్లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది పీవీ సింధు. రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన ఈ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.. తాజా టోక్యో విశ్వక్రీడల్లో కాంస్యంతో మెరిసింది. ఈ విజయంతో కోట్లాది భారతీయుల మోముల్లో ఆనందాన్ని నింపింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ట్విటర్ యూజర్ ఆసక్తికరంగా స్పందించాడు. సింధు గెలుపునకు బహుమానంగా.. మహింద్రా కంపెనీ రూపొందించిన థార్ వాహనాన్ని ఆమెకు బహుమానంగా ఇవ్వాలని కోరాడు. తన కోరికను తెలియజేస్తూ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రాను తన పోస్టుకు ట్యాగ్ చేశాడు.
ఆ పోస్టుపై ఆనంద్ మ తనదైన శైలిలో స్పందించారు. ‘ఇప్పటికే సింధు గ్యారేజ్లో ఓ థార్ వాహనం పార్క్ చేసి ఉంది’ అని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్ 2016లో పతకాలు సాధించిన పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మలిక్కు అప్పుడే మహింద్రా కంపెనీ థార్ వాహనాలను బహుమతిగా అందించింది. ఆ విషయాన్ని ఆనంద్ మహింద్రా చెప్పకనే చెప్పారు. బహుమతిగా ఇచ్చిన థార్ వాహనంలో సింధు, సాక్షి మలిక్ ప్రయాణిస్తున్న ఓ ఫొటోను కూడా ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు.
పీవీ సింధు విజయం పట్ల ఆనంద్ మరో ట్వీట్లో ప్రశంసలు కురిపించారు. సింధు ఫొటోను పంచుకుంటూ ఆమె ప్రదర్శన స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ‘మానసిక బలానికి కూడా ఒలింపిక్స్ ఉంటే ఆమె అందరికంటే టాప్లో ఉంటుంది. నిరుత్సాహపరిచిన ఓటమిని అధిగమించేందుకు ఎంతటి శక్తిసామర్థ్యాలు, నిబద్ధత అవసరమో ఆలోచించండి. నువ్వెప్పుడూ మా బంగారు అమ్మాయివే సింధూ..’ అంటూ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్