Vizag: విశాఖకు కార్యాలయాలను తరలించొద్దు: ఏపీ హైకోర్టు

విశాఖపట్నానికి రాష్ట్ర కార్యాలయాల తరలింపుపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Published : 23 Dec 2023 23:45 IST

అమరావతి: విశాఖపట్నానికి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు కార్యాలయాలను ఇప్పుడప్పుడే తరలించొద్దని ఆదేశించింది. కార్యాలయాల తరలింపు జీవోను సవాల్‌ చేస్తూ హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లు శనివారం ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. అయితే.. సంబంధిత పిటిషన్లను ఏ బెంచ్‌ విచారణ చేపట్టాలో త్వరలో ప్రధాన న్యాయమూర్తి తేలుస్తారని పేర్కొంది. సీజే బెంచ్‌ ఎదుట ఈ పిటిషన్లను ఉంచాలని రిజిస్ట్రీకి సూచించింది. విచారణ పూర్తయ్యే వరకు కార్యాలయాలను తరలించొద్దని శనివారం సాయంత్రం ప్రభుత్వానికి హైకోర్టు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని