Vijayawada: ప్రత్తిపాటి శరత్‌కు బెయిల్‌ మంజూరు

తెదేపా సీనియర్‌ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 14 Mar 2024 17:18 IST

విజయవాడ: మాచవరం పోలీసులు పెట్టిన కేసులో మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని న్యాయాధికారి బెయిల్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుల్లారావు భార్య, కుమారుడు, బావమరిది సహా ఏడుగురిపై విజయవాడలోని మాచవరం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని