Bharat Biotech: మానవ వనరుల ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది: కృష్ణా ఎల్లా
మానవ వనరుల ఎగుమతుల్లో ప్రపంచంలోనే భారత్ తొలిస్థానం దక్కించుకుంటుదని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఛైర్మన్, ఎండీ కృష్ణా ఎల్లా అభిప్రాయపడ్డారు.....
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: మానవ వనరుల ఎగుమతుల్లో ప్రపంచంలోనే భారత్ తొలిస్థానం దక్కించుకుంటుందని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఛైర్మన్, ఎండీ కృష్ణా ఎల్లా అన్నారు. అమెరికా, జపాన్, చైనా, యూరప్ దేశాలు..తదితర దేశాల్లో ఎంతో మంది భారత యువ ఇంజినీర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎఫ్టీసీసీఐలో మంగళవారం ఏర్పాటు చేసిన వాణిజ్య సప్తాహ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశాభివృద్ధి అనేది జీడీపీ వృద్ధిపై అధారపడి ఉంటుందని తెలిపారు. ఇందుకోసం ఉత్పత్తి, ఆవిష్కరణలపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఆంగ్లం సరిగా మాట్లాడలేని చైనీయులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నారని.. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వల్లే వారికి అది సాధ్యమైందని కృష్ణా ఎల్లా వివరించారు. మంచి డిగ్రీలు, జ్ఞానం ఉన్నప్పటికీ సరైన నైపుణ్యాలు లేకపోవడంతో భారత్ వెనకపడుతోందని.. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నాయని కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. భవిష్యత్తు అంతా పర్సనలైజ్డ్ మెడిసిన్ ఉండబోతుందని.. వ్యాధి నిరోధకశక్తిని పెంచేలా కార్టీసెల్ థెరపీ, ఎన్కే సెల్ థెరపీలు జరగనున్నాయని ఆయన వివరించారు. త్వరలో 3డీ మ్యానుఫ్యాక్చరింగ్ సాంకేతికత అందుబాటులోకి రానుందని ఇందుకోసం మార్గదర్శకాలు విడుదలయ్యాయని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
డీబీటీ పథకాలకు సంబంధించి సీఎస్ జవహర్రెడ్డి ఇచ్చిన వివరణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్