‘పుదుచ్చేరి ఎన్నికలు వాయిదా వేయొచ్చా?’

చెన్నై: అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఆధార్‌ డేటాను ఎన్నికల ప్రచారం కోసం భాజపా వాడుతోందన్న ఆరోపణలపై మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. దీనిపై లోతైన దర్యాప్తు అవసరమని వ్యాఖ్యానించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు అవసరమైతే ఏప్రిల్‌ 6న జరగాల్సిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేయొచ్చా అని..

Updated : 27 Mar 2021 04:39 IST

ఈసీని అడిగిన మద్రాస్‌ హైకోర్టు

చెన్నై: అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఆధార్‌ డేటాను ఎన్నికల ప్రచారం కోసం భాజపా వాడుతోందన్న ఆరోపణలపై మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. దీనిపై లోతైన దర్యాప్తు అవసరమని వ్యాఖ్యానించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు అవసరమైతే ఏప్రిల్‌ 6న జరగాల్సిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేయొచ్చా అని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) అడిగింది.

పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఓటర్ల ఆధార్‌ డేటాను భాజపా వినియోగిస్తోందని, వందల వాట్సాప్‌ గ్రూప్‌లూ ఏర్పాటు చేసిందంటూ డెమోక్రటిక్‌ యూత్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీవైఎఫ్‌ఐ) అధ్యక్షుడు ఆనంద్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ సంజీమ్‌ బెనర్జీ, జస్టిస్‌ సేంతికుమార్‌ రామమూర్తి విచారణ చేపట్టారు. ఎన్నికల వాయిదా గురించి ఈసీ అభిప్రాయాన్ని కోరారు. దీనికి ఈసీ తరఫు న్యాయవాది రాజగోపాలన్‌ సమాధానమిస్తూ.. కేవలం ఆరోపణలతో ఎన్నికలను వాయిదా వేయలేమని చెప్పారు. వివరణ ఇచ్చేందుకు భాజపాకు ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు జారీ చేశామన్నారు. దర్యాప్తు కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగించాలని, విచారణ ఎంతవరకు వచ్చిందో ఈ నెల 31న నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఈసీకి ఆదేశాలిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని