దిల్లీ, కేరళలో కరోనా విశ్వరూపం
దేశ రాజధాని నగరం దిల్లీ, కేరళలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ అక్కడ కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దిల్లీలో వరుసగా రెండో రోజూ 6వేలకు పైగా కేసులు నమోదు కావడం కలకల...........
దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీ, కేరళలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ అక్కడ కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దిల్లీలో వరుసగా రెండో రోజూ 6వేలకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. నిన్న 6,725 కేసులు రాగా.. ఈ రోజు 6,842 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 51 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 6,703కి పెరిగింది. కొత్త కేసులతో కలిపి దిల్లీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,09,938కి పెరిగింది. అలాగే, 3,65,866 మంది కోలుకోగా.. ప్రస్తుతం 37,369 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరోవైపు, దిల్లీలో కరోనా వైరస్ మూడో విజృంభణ మొదలైనట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఎవరూ భయపడొద్దని సూచించారు.
కేరళలో మరో 28 మంది మృతి
కేరళలో గడిచిన 24 గంటల్లో 71,270 శాంపిల్స్ పరీక్షించగా.. 8,516 కొత్త కేసులు వచ్చాయి. మరో 28 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి దాకా 48.60లక్షల శాంపిల్స్ పరీక్షించగా.. 4.48 లక్షల మందిలో కరోనా ఉన్నట్టు తేలింది. తాజాగా మరో 8,206 మంది కోలుకోగా ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 3.72 లక్షలకు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,587 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 84,995 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యమంత్రి కేకే శైలజ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతుకుజీవుడా..
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
రాములోరికి పసిడి పుష్పార్చన
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.