దిల్లీ, కేరళలో కరోనా విశ్వరూపం
దేశ రాజధాని నగరం దిల్లీ, కేరళలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ అక్కడ కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దిల్లీలో వరుసగా రెండో రోజూ 6వేలకు పైగా కేసులు నమోదు కావడం కలకల...........
దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీ, కేరళలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ అక్కడ కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దిల్లీలో వరుసగా రెండో రోజూ 6వేలకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. నిన్న 6,725 కేసులు రాగా.. ఈ రోజు 6,842 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 51 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 6,703కి పెరిగింది. కొత్త కేసులతో కలిపి దిల్లీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,09,938కి పెరిగింది. అలాగే, 3,65,866 మంది కోలుకోగా.. ప్రస్తుతం 37,369 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరోవైపు, దిల్లీలో కరోనా వైరస్ మూడో విజృంభణ మొదలైనట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఎవరూ భయపడొద్దని సూచించారు.
కేరళలో మరో 28 మంది మృతి
కేరళలో గడిచిన 24 గంటల్లో 71,270 శాంపిల్స్ పరీక్షించగా.. 8,516 కొత్త కేసులు వచ్చాయి. మరో 28 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి దాకా 48.60లక్షల శాంపిల్స్ పరీక్షించగా.. 4.48 లక్షల మందిలో కరోనా ఉన్నట్టు తేలింది. తాజాగా మరో 8,206 మంది కోలుకోగా ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 3.72 లక్షలకు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,587 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 84,995 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్యమంత్రి కేకే శైలజ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
రెండ్రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను క్యాట్ కొట్టి వేసింది. -
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
Japan: జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్