మా ఎమ్మెల్యేని మార్చెయ్.. రోడ్డు సమస్య తీర్చు.. మా ఆయన చేత మందు మాన్పించు
భక్తులు ఆలయాలకు వెళ్లి ఎన్నో కోరికలు కోరుతుంటారు. అవన్నీ వారి వ్యక్తిగతం. ఇతరులకు చెప్పడానికి కూడా ఇష్టపడరు. సాధారణంగా మంచి మార్కులు, ఉద్యోగం రావాలని, మంచి సంబంధం కుదరాలని, ఆర్థిక కష్టాలు తీరాలని మొక్కుతుంటారు. అయితే, కర్ణాటకలోని హసన్లో ఉన్న హసనంబా దేవతను నమ్మే భక్తుల్లో కొందరు కొన్ని విచిత్రమైన కోరికలు కోరారు. ఏడాది పొడవునా మూసి ఉండే హసనంబా దేవాలయం ఏటా దీపావళి సందర్భంగా కేవలం తొమ్మిది రోజులు మాత్రమే తెరుస్తారు. ఇటీవల ఆలయాన్ని తెరవడంతో భక్తులు పొటెత్తారు. తొమ్మిది రోజులు ముగిసిన తర్వాత ఆలయాన్ని
కర్ణాటకలోని ఓ దేవాలయంలో కోరికలు ఏకరుపెట్టిన భక్తులు
బెంగళూరు: భక్తులు ఆలయాలకు వెళ్లి ఎన్నో కోరికలు కోరుతుంటారు. అవన్నీ వారి వ్యక్తిగతం. ఇతరులకు చెప్పడానికి కూడా ఇష్టపడరు. సాధారణంగా మంచి మార్కులు, ఉద్యోగం రావాలని, మంచి సంబంధం కుదరాలని, ఆర్థిక కష్టాలు తీరాలని మొక్కుతుంటారు. అయితే, కర్ణాటకలోని హసన్లో ఉన్న హసనాంబ దేవతను నమ్మే భక్తుల్లో కొందరు కొన్ని విచిత్రమైన కోరికలు కోరారు. ఏడాది పొడవునా మూసి ఉండే హసనాంబ దేవాలయం ఏటా దీపావళి సందర్భంగా కేవలం తొమ్మిది రోజులు మాత్రమే తెరుస్తారు. ఇటీవల ఆలయాన్ని తెరవడంతో భక్తులు పొటెత్తారు. తొమ్మిది రోజులు ముగిసిన తర్వాత ఆలయాన్ని యథాతథంగా మూసివేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు హుండీని తెరిచి చూడగా.. అందులో భక్తుల కానుకలతో పాటు.. కొన్ని చీటీలు బయటపడ్డాయి. ఓ చీటీలో ఒక భక్తుడు ‘‘అమ్మా.. మా నియోజకవర్గ ప్రజలను కాపాడు. ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వెంటనే ఎమ్మెల్యేని మార్చేయ్. ఎన్నికల్లో ఆయన కుటుంబమంతా ఓడిపోయేలా చూడు’’అని రాశారు.
స్థానికంగా ఉండే మరో భక్తుడు తన ఇంటి అడ్రెస్ రాసి.. తన కాలనీ రోడ్డులో గుంతలు పడ్డాయని, ఆ సమస్యను తీర్చాలని కోరుతూ చీటీని హుండీలో వేశాడు. ఇంకొకరు తన కోరికను వెల్లడించలేదు గానీ.. తన కోరికను నెరవేర్చితే రూ.5వేలు ఇస్తానని దేవతకే ఆఫర్ ఇచ్చారు. మరో భక్తురాలు తన భర్త మద్యపానం అలవాటును మానుకునేలా చూడమని కోరింది. మరో యువతి తన ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకునేలా దీవించమని ఏకంగా రక్తంతో చీటీ రాసింది. ఇలాంటి విచిత్రమైన చీటీలు చూసి ఆలయ నిర్వాహకులు అవాక్కయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM