AP News: ఆ యాప్ ఉంటే చాలు.. బస్సు ప్రయాణం ఉచితం!
దిశా యాప్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయనగరం జిల్లా పోలీసు యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయనగరంలో మహిళలు .....
విజయనగరం పోలీసులు వినూత్న కార్యక్రమం
విజయనగరం: దిశా యాప్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విజయనగరం జిల్లా పోలీసు యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయనగరంలో మహిళలు తమ మొబైల్ ఫోన్లలో దిశా యాప్ను చూపిస్తే.. పట్టణంలోని ముఖ్య కూడళ్ళ నుంచి ఇతర ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్పీ దీపికా పాటిల్ వెల్లడించారు. ఇందుకోసం పోలీస్ శాఖ రెండు బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. శనివారం విజయనగరంలో దిశా యాప్పై నిర్వహించిన అవగాహన సదస్సుకు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం సీఎం జగన్ ఈ గొప్ప యాప్ను తీసుకొచ్చారన్నారు.
ప్రతి మహిళా తనను తాను రక్షించుకునేందుకు ఇదో ఆయుధంలా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతిఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాప్ని డౌన్లోడ్ చేసుకోవడంలో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉండాలని, ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని ఆమె కోరారు. అనంతరం కళ్యాణ మండపం నుంచి దిశా పోలీసు స్టేషను వరకు దిశా యాప్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కె.శ్రావణి, పోలీసు అధికారులతో పాటు మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ