తమిళనాడులో రూ. 5 కోట్లు: రంగంలోకి ఈడీ

తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న కారులో రూ.5.27 కోట్లు లభించడం రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రి బాలినేని స్టిక్కర్‌ ఉన్న కారులో డబ్బును తరలిస్తు ఒంగోలు వ్యాపారి పోలీసులకు పట్టుబడ్డాడు. దీనిపై ఐటీ శాఖ విచారణ చేపట్టింది. అయితే

Published : 27 Jul 2020 13:50 IST

అమరావతి: తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న కారులో రూ.5.27 కోట్లు లభించడం రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ఐటీ శాఖ విచారణ చేపట్టింది. అయితే తాజాగా ఈ ఘటనపై విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రంగంలోకి దిగింది. చెన్నై పోలీసులు, ఐటీ అధికారులను కేసుకు సంబంధించిన వివరాలు కోరింది. చెన్నైలో ఎవరికి ఇచ్చేందుకు ఈ నగదు తరలిస్తున్నారనే అంశంపై ఆరా తీస్తోంది. 

ఇటీవల చెన్నై పోలీసులు ఎలావూరులోని చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఆ వైపుగా వచ్చిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారును ఆపి తనిఖీ చేశారు. వెనుక సీట్లో ఉన్న నాలుగు సంచుల్లో రూ.5.27 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ఒంగోలుకు చెందిన నాగరాజ్‌, వసంత్‌, కారు డ్రైవరు సత్యనారాయణన్‌లను అరెస్టు చేశారు. నగదును ఐటీ అధికారులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని