Bihar: ‘ఉచితంగా దుస్తులుతకాలి’.. వినూత్న షరతుతో నిందితుడికి బెయిల్
మహిళలపై గౌరవాన్ని పెంపొందించే దిశగా.. ఓ అత్యాచార యత్నం కేసులో నిందితుడికి విభిన్నమైన షరతుతో బెయిల్ మంజూరు చేసింది బిహార్లోని ఝంఝార్పూర్ కోర్టు. ఆరు నెలలపాటు ఉచితంగా గ్రామానికి చెందిన మహిళలందరి దుస్తులను ఉతికి, ఇస్త్రీ చేసి ఇవ్వాలని...
పట్నా: మహిళలపై గౌరవాన్ని పెంపొందించే దిశగా ఓ అత్యాచార యత్నం కేసులో నిందితుడికి వినూత్నమైన షరతుతో బెయిల్ మంజూరు చేసింది బిహార్లోని ఝంఝార్పూర్ కోర్టు. ఆరు నెలలపాటు ఉచితంగా గ్రామానికి చెందిన మహిళలందరి దుస్తులను ఉతికి, ఇస్త్రీ చేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మధుబని జిల్లా మఝోర్ గ్రామానికి చెందిన లల్లన్ కుమార్ (20).. ఓ మహిళపై అత్యాచారానికి యత్నించిన కేసులో ఈ ఏడాది ఏప్రిల్లో అరెస్టయ్యాడు. తాజాగా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరిందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చాడు.
నిందితుడికి వయస్సు తక్కువగా ఉందని, పైగా మహిళలపై తన గౌరవాన్ని చాటుకునేందుకు అతడు సమాజ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న అడిషనల్ సెషన్స్ జడ్జి అవినాశ్ కుమార్.. ఇటీవల నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ.. అతడు వచ్చే ఆరు నెలలపాటు గ్రామంలోని మహిళలందరి దుస్తులను ఉచితంగా ఉతకాలని, ఇస్త్రీ చేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మధ్యలోనే వెనక్కి తగ్గితే తమ దృష్టికి తీసుకురావాలని కోర్టు ఆ గ్రామ సర్పంచికి సూచించారు. మరోవైపు ఈ నిర్ణయంపై గ్రామ మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM