Nirmal: మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి నిరాహార దీక్ష భగ్నం

భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిర్మల్‌లో చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటక భగ్నం చేశారు.

Published : 21 Aug 2023 04:00 IST

నిర్మల్‌: భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిర్మల్‌ పట్టణ మాస్టర్‌ ప్లాన్‌, జీవో నం.220ను రద్దు చేయాలని మహేశ్వర్‌రెడ్డి ఐదురోజుల క్రితం నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటాక మహేశ్వర్‌రెడ్డి దీక్షను భగ్నం చేశారు. 

మహేశ్వర్‌రెడ్డి నిరాహార దీక్షకు సంఘీభావంగా భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఆందోళనకారులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీఛార్చి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని