ఉచిత శిక్షణ.. భవిత రక్షణ..
ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంటర్బోర్డు అడుగులు వేస్తోంది. పోలీసు శాఖలో స్థిరపడాలనుకునే వారికి ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ ఉద్యోగాలకు పోటీ పడేలా పూర్తిస్థాయిలో సన్నద్ధం చేస్తోంది. కోచింగ్ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టలేని విద్యార్థులకు భరోసా కల్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంటర్బోర్డు అడుగులు వేస్తోంది. పోలీసు శాఖలో స్థిరపడాలనుకునే వారికి ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ ఉద్యోగాలకు పోటీ పడేలా పూర్తిస్థాయిలో సన్నద్ధం చేస్తోంది. కోచింగ్ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టలేని విద్యార్థులకు భరోసా కల్పిస్తోంది. త్వరలో నిర్వహించనున్న పోలీసు నియామకాలను దృష్టిలో ఉంచుకుని ఉచిత శిక్షణ ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో విద్యార్థులకు.. పోలీసు నియామక పరీక్షలకు అవసరమయ్యే శిక్షణ అందిస్తోంది. దేహదారుఢ్య, రాత పరీక్షల కోసం వారిని సన్నద్ధం చేస్తున్నారు అధికారులు.
ఇందుకోసం ప్రతిజిల్లాలోనూ సుమారు వందమందిని ఎంపిక చేశారు. అందులో భాగంగా ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారితో పాటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హత కలిగిన వారికి ఉచితంగా తర్ఫీదు ఇస్తున్నారు. పోలీసు శాఖతో పాటు ఆర్మీ తదితర పోటీ పరీక్షల్లోనూ ప్రతిభ చూపేలా తీర్చిదిద్దుతున్నారు. తమ శిక్షణతో చాలామంది బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయని చెబుతున్నారు.
‘‘ప్రతిరోజూ ఉదయం 5:30 గంటల నుంచి 7:30/8:00 గంటల వరకు ఫిజికల్ ఫిట్నెస్కు సంబంధించిన శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులు బాగా కష్టపడుతున్నారు. వారు కచ్చితంగా ఉద్యోగాలు సాధిస్తారన్న నమ్మకం మాకుంది. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులే ఉన్నారు. ఇదేరకమైన శిక్షణ బయట తీసుకోవాల్సి వస్తే ఒక్కొక్కరికీ ఇరవై నుంచి నలభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు అంత డబ్బు ఖర్చుచేసి శిక్షణ తీసుకోలేరు. అందువల్ల వారికోసమే ఈ కార్యక్రమం కొనసాగుతోంది’’ అని సమన్వయ కర్తలు, శిక్షకులు చెబుతున్నారు.
ఉచితంగా శిక్షణ తమకు ఓ వరమని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ కోసం వేల రూపాయలు ఖర్చుపెట్టి సుదూర ప్రాంతాలకు వెళ్లలేని తమకు ఇదో గొప్ప అవకాశం అని చెబుతున్నారు. ఇంటర్ తరువాత విద్యార్థులు గందరగోళానికి గురవ్వకుండా సరైన మార్గంలో నడిపేందుకు ఇలాంటి శిక్షణలు ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతుకుజీవుడా..
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
రాములోరికి పసిడి పుష్పార్చన
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు