Gastric Cancer: గ్యాస్ట్రిక్ క్యాన్సర్ను గుర్తించడం ఎలా..? ఈ విషయాలు తెలుసుకోండి..!
మనం పద్ధతి ప్రకారం నడుచుకున్నపుడు ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. దారి తప్పినపుడు కొత్త కొత్త సమస్యలు వెలుగులోకి వస్తాయి. ప్రాణాంతకమైన జబ్బులు కూడా అలాగే రానున్నాయి. గుండెపోటు, క్యాన్సర్ లాంటి వ్యాధులు మన తీరు మారడంతోనే పుట్టుకొస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మనం పద్ధతి ప్రకారం నడుచుకున్నపుడు ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. దారి తప్పినపుడు కొత్త కొత్త సమస్యలు వెలుగులోకి వస్తాయి. ప్రాణాంతకమైన జబ్బులు కూడా అలాగే రానున్నాయి. గుండెపోటు, క్యాన్సర్ లాంటి వ్యాధులు మన తీరు మారడంతోనే పుట్టుకొస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇష్టం వచ్చినట్టు తినడం, వ్యాయామం లేకపోవడంతో పొట్టకు చికాకు కలుగుతోంది. జంక్ ఫుడ్తో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎక్కువగా వస్తోందని సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ విజయ్ కోడూరు తెలిపారు.
ఎందుకొస్తుందంటే...
ఎక్కువకాలం నిల్వ ఉన్న ఆహార పదార్థాలు, కూరగాయలు, ఫాస్ట్ఫుడ్ తినడంతో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉప్పు తినడంతో కూడా ప్రమాదం ఉంటుంది. పొగాకు వినియోగం, మద్యపానంతో కూడా వస్తుంది. కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టు ఉంటుంది. వాంతులు కావడం, వాంతిలో రక్తం పడే లక్షణాలు కనిపిస్తాయి. పచ్చకామెర్లు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
ఏం చేస్తామంటే...!
గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కణితిని ఆపరేషన్ చేసి తీసేయాల్సిందే. అవసరమయితే కిమో, రేడియోథెరపీ కూడా చేయకతప్పదు. సరయిన సమయంలో చికిత్స చేయించుకుంటే ప్రాణానికి ప్రమాదం ఉండదు. ఆహార పద్ధతులు సరిగా ఉండేలా చూసుకోవాలి. పండ్లుఎక్కువగా తీసుకోవాలి. వ్యాయామం చేస్తే ఈ జబ్బు వచ్చే ప్రమాదం ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్