Stock market: వరుస నష్టాలకు బ్రేక్‌.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 10 May 2024 16:00 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిలయన్స్‌, ఐటీసీ వంటి అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. దీంతో వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. నిఫ్టీ 22 వేల స్థాయి ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 72,475.45 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 72,366.29- 72,946.54 మధ్య సూచీ కదలాడింది. చివరికి 260.30 పాయింట్ల లాభంతో 72,664.47 వద్ద ముగిసింది. నిఫ్టీ 97.70 పాయింట్ల లాభతో 22,055 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.50గా ఉంది.

సెన్సెక్స్‌లో ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ చమురు ధర 84.35 డాలర్లుగా కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు