కాకినాడ ఎమ్మెల్యేపై ఫిర్యాదు

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకులు పట్టణ పోలీసుస్టేషన్‌లో శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

Published : 12 Jan 2020 08:11 IST

మంగళగిరి: కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకులు పట్టణ పోలీసుస్టేషన్‌లో శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పార్టీ నాయకులు రావి రమా, శెట్టి రామకృష్ణ, బేతపూడి విజయశేఖర్‌, సామల నాగేశ్వరరావు, దాసరి కిరణ్‌, నందమోహన్‌లు పట్టణ ఎస్‌.ఐ.నారాయణలను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు నమోదు చేయాలని మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌లో సీఐ శేషగిరిరావుకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని