తెలుగు రాష్ట్రాల సీఎంల సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరజల్లేలా దేవతలు దీవించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి

Updated : 13 Jan 2020 12:52 IST

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరజల్లేలా దేవతలు దీవించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి నిర్వహించుకోవాలని అన్నారు. ప్రతీ ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరారు.

సంస్కృతీ సంప్రదాయాలకు మనమిచ్చే గౌరవానికి సంక్రాంతి ప్రతీక అని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. గత 7 నెలల్లో రైతు సంక్షేమానికి చర్యలు తీసుకున్నామని చెబుతూ.. సంక్రాంతి పండగను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని