పొంగల్‌ వేడుకల్లో తెలంగాణ గవర్నర్‌

చెన్నై: తెలంగాణ గవర్నర్‌ సౌందరరాజన్‌ తమిళసై చెన్నైలో తన కుటుంబసభ్యులతో కలిసి పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో భాగంగా ఆమె పొంగల్‌ వండారు. ‘తెలంగాణ- తమిళనాడుకు

Published : 14 Jan 2020 19:15 IST

చెన్నై: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెన్నైలో తన కుటుంబసభ్యులతో కలిసి పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో భాగంగా ఆమె పొంగల్‌ వండారు. ‘తెలంగాణ- తమిళనాడుకు వారధిలా ఉంటాను. తెలంగాణ సోదరసోదరీమణులకు పండుగ శుభాకాంక్షలు. తమిళనాడులోని ప్రాచీన ఆలయాల శిల్ప సౌందర్యాన్ని వీక్షించాలనే ఆతృతను ప్రజలు కనబరుస్తున్నారు. తమిళనాడు ఆలయాలను సందర్శించి దేవుడిని ప్రార్థించి.. ఇక్కడి ప్రాచీన శిల్ప సౌందర్యాన్ని ఆస్వాదించాలని అందరినీ ఆహ్వానిస్తున్నాను.’ అని ఆమె తెలిపారు. జల బంధం తదితర అంశాలపై తనకు చాలా ఆలోచనలు ఉన్నాయని వాటిని ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. 

చెన్నైలో పొంగల్ జరుపుకొన్న ఉపరాష్ట్రపతి..

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెన్నైలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. కుటుంబసభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని