విశాఖ వద్దనలేదు అనే రోజొస్తుంది: అంబటి
అందరూ బాగుండాలి.. అందులో నేనూ ఉండాలనేది తమ విధానం అని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. 3 ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించి ఈ బిల్లును
అమరావతి: అందరూ బాగుండాలి.. అందులో నేనూ ఉండాలనేది తమ విధానం అని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. 3 ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించి ఈ బిల్లును తీసుకొచ్చామని అన్నారు. అందరూ నాశనం కావాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. రాజధానుల అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే ఎలా? రియల్ ఎస్టేట్ అధిపతిగా చంద్రబాబు వ్యవహరించారు. మాది తుగ్లక్ ప్రభుత్వం అని ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి రాజధాని వదిలేసి వచ్చిన వారిది తుగ్లక్ పాలన కాదా? ప్రజల్ని రెచ్చగొట్టి విద్వేషాలు పెంచుతున్నారు. బినామీల పేరిట 4వేల ఎకరాలు కొనుగోలు చేశారు. అందుకే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేశారు.
మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని తరలిస్తారా? అని చంద్రబాబు అంటున్నారు. మోదీ వస్తానంటే అడ్డుకుంటామన్నది మీరు కాదా? కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. రాయలసీమలోనే శాశ్వత హైకోర్టు ఏర్పాటు చేస్తామని ఆ పార్టీనే చెప్పింది. కానీ తెదేపా నుంచి ఆ పార్టీలోకి వెళ్లిన ఓ వ్యక్తి కేంద్రం జోక్యం చేసుకుంటుందని అంటున్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోందని, రాజధాని రైతులు భూములు తిరిగిస్తామని అదే పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. గతంలో ఇంగ్లీషు మీడియం విషయంలో ఇలానే తెదేపా వ్యతిరేకించింది. ఆ తర్వాత మేం ఎప్పుడు వద్దన్నాం అని మాట మార్చింది. అలాగే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వద్దని తాము ఎప్పుడన్నాం అనే రోజు వస్తుంది. అమరావతి కోసం 24 మంది రైతులు చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. గుంటూరులో ఉన్న నాకే ఆ విషయం తెలీదు. అవన్నీ అసత్య ప్రచారాలు’’ అని అంబటి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
నాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ నాని పోస్ట్ పెట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?