మందడంలో పోలీసులతో మహిళల వాగ్వాదం
77వ రోజు కొనసాగుతున్న రాజధాని ఆందోళనలు
అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 77వ రోజు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రైతుల దీక్షలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మందడంలో రైతుల ధర్నాకు కృష్ణా జిల్లా కొండపల్లి, ప్రసాదంపాడు మహిళలు మద్దతు తెలిపారు. రైతులతోపాటు దీక్షా శిబిరంలో కూర్చుని ఆందోళనల్లో పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సచివాలయానికి వెళ్లడంతో మందడంలో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద నెట్లు పట్టుకుని పహారా కాశారు. మందడం దీక్షా శిబిరంపై ఆంక్షలు విధించారు. కొత్తగా ఏర్పాటు చేసిన శిబిరంలో రైతులు ఆందోళన చేసేందుకు అనుమతివ్వలేదు. ఈ క్రమంలో పోలీసులకు మహిళలకు మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రైవేటు స్థలంలో ఆందోళన చేస్తుంటే పోలీసుల అభ్యంతర మేంటని మహిళలు నిలదీశారు. ఎవరెంత రెచ్చకొడుతున్నా గత 76 రోజులుగా శాంతియుతంగానే ఆందోళనలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పాలకులు మా గోడు వినాలనే ఇన్ని రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని.. అలాంటిది పాలకులకు కనపడకూడదని ఆంక్షలు విధించడం సరికాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కుల కోసమే ఈ పోరాటమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షా శిబిరాన్ని ఖాళీ చేసేది లేదని వారు తేల్చి చెప్పారు. అదేవిధంగా అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు తమ పోరాటం ఆగదని రైతులు స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
-
India News
Lumpy Disease: పశువులను పీడిస్తోన్న ‘లంపీ’ డిసీజ్.. రాజస్థాన్లోనే 12వేల మూగజీవాలు మృతి
-
Sports News
Rohit sharma: ఈ ప్లాన్తోనే భారత క్రికెట్కు మంచి భవిష్యత్ను అందిస్తాం: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
-
World News
Rishi Sunak: తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్గా ఎవరంటే?
- China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!
- Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్