లాక్‌డౌన్‌: డ్రోన్‌తో విశాఖ రైల్వేస్టేషన్‌ ఇలా!

కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశంలో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలవుతోంది. అన్ని రాష్ట్రాలూ లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశనం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలు కూడా వైరస్‌

Updated : 13 Sep 2023 12:43 IST

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశంలో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలవుతోంది. అన్ని రాష్ట్రాలూ లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశనం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలు కూడా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్నాయి. నిర్దేశించిన మినహా మిగతా సమయాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించాయి. గ్రామాల్లో సైతం ఇవి కఠినంగా అమలవుతున్నాయి. పోలీసు సిబ్బంది ఎక్కడికక్కడ పహారా కాస్తున్నారు.

ఏపీ పోలీసులు పలుచోట్ల డ్రోన్లతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తాజాగా విశాఖపట్నం, గుంటూరు జిల్లా తెనాలి, పశ్చిమగోదావరి జిల్లా తంగెళ్లమూడి కంటైన్‌మెంట్‌ జోన్‌ పరిధిలో డ్రోన్‌తో తీసిన దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. విశాఖ రైల్వేస్టేషన్‌ పరిసరాలు, తెనాలి పట్టణం, తంగెళ్లమూడి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆయా ప్రాంతాల డ్రోన్‌ దృశ్యాలు మీకోసం.. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని