రోడ్డుపై నోటు..తీద్దామంటే డౌటు!
రోడ్డుపై కరెన్సీనోట్లు కుప్పలుగా పడిఉన్నా, ఒక్కరూ కూడా వాటిని తీసుకోని ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. అందుకు కారణం కరోనావైరస్ ఆ
ఇండోర్: రోడ్డుపై కరెన్సీనోట్లు కుప్పలుగా పడిఉన్నా, ఒక్కరూ కూడా వాటిని తీసుకోని ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. అందుకు కారణం కరోనావైరస్ ఆ నోట్లపై ఉంచవచ్చునేమోనన్న భయమే. వివరాల్లోకి వెళితే ఇండోర్ నగరంలో గురువారం మిట్ట మధ్యాహ్నం రూ. 20, 50, 100, 200, 500 కరెన్సీనోట్లు పెద్దసంఖ్యలో రోడ్డుపై పడి ఉన్నాయి. దీన్ని గమనించిన అక్కడివారు వాటిని తీసుకోకుండా వెంటనే పెట్రోలింగ్పోలీసులకు ఫోన్ చేశారు. వారు అక్కడకు చేరుకుని నోట్లను శానిటైజింగ్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. మొత్తం విలువ రూ.6,480. దీనిపై పోలీసుఅధికారి రాజీవ్సింగ్ బదోరియా స్పందిస్తూ ‘‘ఇక్కడి స్థానికులు కంట్రోల్రూమ్కు ఫోన్చేసి కరెన్సీనోట్లు రోడ్డుపై పడిఉన్నాయని అన్నారు. అక్కడికి వెళ్లి మొత్తం నోట్లన్నంటినీ శానిటైజ్ చేసి సీజ్ చేశాం. ఇప్పటివరకు ఈ డబ్బు తమదంటూ ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. ఎవరైనా అనుకోకుండా పారేసుకున్నారా లేదా? కావాలనే ఇక్కడ వేశారా? అనే విషయాన్ని సీసీటీవీ ఫుటేజి పరిశీలించి తెలుసుకుంటాం’’ అని వివరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోపక్క మధ్యప్రదేశ్లో కరోనాకేసుల సంఖ్య 938కు చేరుకోగా 53 మంది మరణించారు. ఒక్క ఇండోర్లోనే 554 కేసులు నమోదవ్వగా.. 37 మంది ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్