ప్రత్యేక రైలులో 1100 మంది వలస కూలీలు
లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో...
సంగారెడ్డి అర్బన్ : లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో వారంతా స్వస్థలాలకు పయనమయ్యారు. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్ వద్ద చిక్కుకు పోయిన వలస కార్మికులను ఎట్టకేలకు స్వస్థలాలకు పంపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులకు అనుగునంగా 1100 మంది వలస కార్మికులను శుక్రవారం తెల్లవారుజామున సంగారెడ్డి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 50 బస్సుల్లో లింగంపల్లి తరలించారు.
లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి వారిని రైలులో ఝార్ఖండ్కు పంపించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, జిల్లా పాలనాధికారి ఎమ్.హన్మంతరావు, రెవెన్యూ , పోలీసు యంత్రాంగం చప్పట్లు కొట్టి వారికి వీడ్కోలు పలికారు. తమను స్వస్థలాలకు పంపించాలంటూ వలస కార్మికులు కంది ఐఐటీ వద్ద బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్