తెలంగాణలో కోర్టులకు లాక్‌డౌన్‌ పొడిగింపు

రాష్ట్రంలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్‌డౌన్‌ను ఈనెల 29 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఈనెల 29 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా, మేజిస్ట్రేట్ కోర్టులు,..

Published : 08 May 2020 02:12 IST

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఈ నెల 29 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా, మేజిస్ట్రేట్ కోర్టులు, ట్రైబ్యునళ్లు, న్యాయ సేవాధికార సంస్థలు, జ్యుడీషియల్ అకాడమీలు పనిచేయవని హైకోర్టు తెలిపింది. అత్యవసర కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టులో సైతం సాధారణ న్యాయ, పరిపాలనా పరమైన కార్యకలాపాలు ఈ నెల 29వరకు నిలిపివేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలిపింది. 

అత్యవసర కేసులతో పాటు తుది విచారణ, అడ్మిషన్ పెండింగ్ కేసుల విచారణను న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టనున్నట్లు హైకోర్టు తెలిపింది. ఇళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కాలేని న్యాయవాదుల కోసం జ్యూడీషియల్ అకాడమీలో నేటి నుంచి నాలుగు వర్చువల్ కోర్టు గదులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. ఇవాళ్టి నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలోని జిల్లాల్లో పూర్తిస్థాయిలో ఫోరాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. వరంగల్, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని మూడు ఫోరాలు సగం మంది సిబ్బందితో పనిచేస్తున్నాయని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని