తెలంగాణలో కోర్టులకు లాక్డౌన్ పొడిగింపు
రాష్ట్రంలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్డౌన్ను ఈనెల 29 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో లాక్డౌన్ ఈనెల 29 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా, మేజిస్ట్రేట్ కోర్టులు,..
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్: రాష్ట్రంలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్డౌన్ను ఈ నెల 29 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో లాక్డౌన్ ఈ నెల 29 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా, మేజిస్ట్రేట్ కోర్టులు, ట్రైబ్యునళ్లు, న్యాయ సేవాధికార సంస్థలు, జ్యుడీషియల్ అకాడమీలు పనిచేయవని హైకోర్టు తెలిపింది. అత్యవసర కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టులో సైతం సాధారణ న్యాయ, పరిపాలనా పరమైన కార్యకలాపాలు ఈ నెల 29వరకు నిలిపివేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
అత్యవసర కేసులతో పాటు తుది విచారణ, అడ్మిషన్ పెండింగ్ కేసుల విచారణను న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టనున్నట్లు హైకోర్టు తెలిపింది. ఇళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కాలేని న్యాయవాదుల కోసం జ్యూడీషియల్ అకాడమీలో నేటి నుంచి నాలుగు వర్చువల్ కోర్టు గదులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. ఇవాళ్టి నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలోని జిల్లాల్లో పూర్తిస్థాయిలో ఫోరాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. వరంగల్, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్లోని మూడు ఫోరాలు సగం మంది సిబ్బందితో పనిచేస్తున్నాయని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?