ప్రత్యేక ప్యాకేజీతో తయారీ రంగానికి ఊతం
లాక్డౌన్ కాలంలో ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వలస కార్మికులు, దినసరి కూలీలకు మేలు చేస్తుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థికశాస్ర్తం విభాగాధిపతి ఆచార్య ప్రసాదరావు అంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థికశాస్ర్త విభాగాధిపతి ఆచార్య ప్రసాదరావు
లాక్డౌన్ కాలంలో ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వలస కార్మికులు, దినసరి కూలీలకు మేలు చేస్తుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థికశాస్ర్తం విభాగాధిపతి ఆచార్య ప్రసాదరావు అన్నారు. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందంటున్నారు. వ్యవసాయ, ఫార్మా రంగాల పరిస్థితి బాగుందని, లాక్డౌన్ వల్ల లక్షల కుటుంబాలకుపైగా రోడ్డున పడ్డాయంటున్న ఆచార్య ప్రసాదరావుతో ప్రత్యేక ముఖాముఖి...
ప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో ఏయే వర్గాల వారికి మేలు జరుగుతుందని మీ అభిప్రాయం..?
లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా ప్రజలు ఎలాంటి ఆదాయం లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం ప్రజలకు ఊరటనిచ్చే అంశం. లాక్డౌన్ ముఖ్యంగా పేదలు, వ్యవసాయదారులు, వలస కూలీలపై చాలా ప్రభావం చూపింది. వీరిలో భరోసా నింపేందుకు ఈ ప్రత్యేక ప్యాకేజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సంక్షోభంలో ఉన్న తయారీ రంగానికి కూడా ఊతమిచ్చినట్లైంది. కరోనా దెబ్బకు రోడ్లు, రైలు, విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. నిరుద్యోగిత బాగా పెరిగిపోయింది. మార్చి 15 వరకు నిరుద్యోగిత రేటు 6.7 శాతం ఉండగా.. ఏప్రిల్ 19 నాటికి అది 26 శాతానికి పెరిగింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థకు పునాదులుగా ఉంటాయి. లాక్డౌన్ ప్రభావం వీటిపైనే ఎక్కువగా పడటంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోను సైతం తట్టుకొని దేశం ఆర్థికంగా నిలబడటానికి కారణం వ్యవసాయ రంగం. భవిష్యత్తులోనూ ఈ రంగంపై మరింత దృష్టి సారించి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆర్థికంగా చూస్తే కరోనా విపత్తు, లాక్డౌన్ నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చంటారు..?
మన దేశంలో యువత (18 నుంచి 25 ఏళ్లలోపు వారు) ఎక్కువగా ఉంది. వారే భారత్కు వెన్నెముక మాదిరి. ఆర్థికంగా పుంజుకోవడానికి ఈ గ్రూపు వారిని తగిన నైపుణ్యాలతో వినియోగించుకోవాలి. కొవిడ్ ప్రభావం వల్ల సప్లయ్, డిమాండ్ గొలుసు తెగిపోయింది. ఇటు పరిశ్రమలు, అటు వ్యవసాయ రంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాలి. ప్రధానంగా ఈ రెండు రంగాల మధ్య లింక్ బలహీనంగా ఉంది. ప్రజల ప్రాణాలు, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో తగు ప్రణాళికలు రూపొందించుకోవాలి. కొవిడ్ను అరికట్టడం చాలా ముఖ్యం. ఈ దిశగా ప్రజలంతా విధిగా సామాజిక దూరం పాటించాలి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలు వెనకడుగు వేయడం లేదు. దేశాలన్నీ ప్రజల త్యాగం మీదే ఆధారపడి ఉంటాయనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మరిన్ని వివరాలు కింది వీడియోలో చూడండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్