అందరం కలిసి పనిచేద్దాం: నిర్మలాసీతారామన్
కరోనావైరస్తో దేశం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయినవేళ అందరం కలిసి పనిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం అన్నారు.
దిల్లీ: కరోనావైరస్తో దేశం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయినవేళ అందరం కలిసి పనిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం అన్నారు. కరోనావైరస్ విజృంభిస్తున్నవేళ వలసకార్మికులను ఆదుకోవడంలో భాజపా ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్నాయకులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆమె స్పందిస్తూ ‘‘చేతులు కట్టుకుని మరీ ప్రతిపక్షపార్టీని అడుగుతున్నాను, ఈ కష్టకాలంలో అందరం కలిసి పనిచేద్దాం. వలసకార్మికుల ఇబ్బందులను తొలగిద్దాం’’ అని వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రప్రభుత్వాలతో సమన్వయపరుచుకుంటూ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శ్రామిక్రైళ్ల ద్వారా ఇప్పటికే పెద్దసంఖ్యలో వలసకార్మికులను వారి స్వస్థలాలకు తరలించామన్నారు. వారికి అవసరమైన నిత్యావసరాలను, ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. అయినప్పటికి చాలామంది ఇంకా కాలినడకన వెళ్తుండటం తమను బాధిస్తుందని, వారిని కూడా అన్నిరకాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్పార్టీ పాలిత రాష్ట్రాల్లో వలసకార్మికులకు ఇంతకంటే మెరుగైనసేవ చేస్తున్నారా..అని ఆమె ప్రశ్నించారు. మరిన్ని రైళ్లు కావాలంటే కేంద్రాన్ని అడగవచ్చని, అలా కాకుండా రోడ్డుపై నడిచివెళ్లే కార్మికులతో మాట్లాడటం, కలిసి కూర్చోటం వల్ల ఉపయోగం ఉండదని, అవసరమైతే వారి బ్యాగులు మోయండంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీని ఉద్దేశించి విమర్శించారు. ప్రస్తుత సంక్షోభసమయాన్ని స్వార్థరాజకీయాల కోసం ఉపయోగించడం మానేసి, కలిసి పనిచేసేందుకు ముందుకువచ్చేలా కాంగ్రెస్పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరుతున్నానని ఆమె తెలిపారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షలకోట్ల ప్యాకేజీకి సంబంధించి ఏ రంగానికి ఎంతెంత కేటాయించారనే దానిపై గత రెండురోజులుగా ఆర్థికమంత్రి సీతారామన్ స్పష్టతను ఇస్తున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!