6 రోజుల్లో కరోనాను జయించిన హెచ్ఐవీ రోగి
కరోనా మహమ్మారి బారి నుండి అత్యంత తీవ్రమైన రోగాల బారిన పడ్డవారు సైతం కోలుకుంటుండడం ఉపశమనం కలిగిస్తోంది. ఇటీవల ఓ క్యాన్సర్ రోగి కరోనాను జయించిన విషయం తెలిసిందే.....
దిల్లీ: అత్యంత తీవ్రమైన రోగాల బారిన పడ్డవారు సైతం కొవిడ్ నుంచి కోలుకుంటుండడం ఉపశమనం కలిగిస్తోంది. ఇటీవల ఓ క్యాన్సర్ రోగి కరోనాను జయించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడు సైతం కరోనా నుంచి బయటపడ్డారు. అదీ కేవలం ఆరు రోజుల్లోనే. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ యువకుడు దిల్లీ నుంచి స్వస్థలమైన గోండాకు బయలుదేరాడు. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే లఖనవూలోని కేజీఎంయూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స సమయంలో తాను అప్పటికే హెచ్ఐవీ మందులు వాడుతున్నట్లు తెలిపారు. అనంతరం జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ కూడా సోకినట్లు తేలింది. తలకు బలమైన గాయం కావడంతో రెండింటికీ కలిపి సంయుక్తంగా చికిత్స అందించారు. చికిత్సకు చురుగ్గా స్పందించిన అతడు ఆరు రోజుల్లోనే కరోనా నుంచి కోలుకున్నాడు. తలకు శస్త్రచికిత్స చేయడంతో మానసిక సమస్య సైతం సమసిపోయిందని కేజీఎంయూ ఆస్పత్రి వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎం.ఎల్.బి భట్ తెలిపారు. డిశ్చార్జికి ముందు రెండుసార్లు పరీక్షలు జరపగా.. కరోనా నెగిటివ్ వచ్చిందన్నారు. ప్రస్తుతం అతడు కోలుకొని ఇంటికి చేరినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?