రోజూకూలీ: కుమార్తెను ఎలా కాపాడుకున్నాడంటే..
మానవాళికి కరోనా వైరస్ తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మహమ్మారి మూలంగా ఒకానొక సందర్భంలో యావత్ ప్రపంచం స్తంభించిపోయింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో మంది చిరుద్యోగులు, వ్యాపారులు...
తిరువనంతపురం: మానవాళికి కరోనా వైరస్ తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మహమ్మారి మూలంగా ఒకానొక సందర్భంలో యావత్ ప్రపంచం స్తంభించిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో మంది చిరుద్యోగులు, వ్యాపారులు, వలసకూలీలు, పేద కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాంటి వారిలో కేరళలోని తిరువనంతపురానికి చెందిన బైజూ ఒకరు. లాక్డౌన్ వేళ ఉపాధి కోల్పోయిన ఈ రోజూకూలీకి మరో పిడుగులాంటి వార్త తెలిసింది. తన ఎనిమిదేళ్ల చిన్నారి అబినా కాలేయ సంబంధిత సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆమె బతకాలంటే ఇంకొకరు తమ కాలేయాన్ని దానం చేయాలి. అలా ఎవరైనా ముందుకొచ్చినా ఆపరేషన్కు రూ.20లక్షలు అవసరమవుతాయి. అలాంటి స్థితిలో బైజు ఏం చేశాడు? తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు?
తిరువనంతపురంలోని నెయ్యటింకర ప్రాంతానికి చెందిన బైజూకు ఇద్దరు కుమార్తెలు. అద్నా(9), అబినా(8). లాక్డౌన్ వేళ అబినా అనారోగ్యంతో బాధపడగా ఓ ఆస్పత్రిలో చూపించారు. ఆ చిన్నారి కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతోందని, వైద్యానికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని, దానికి రూ.20లక్షలు అవసరమవుతాయని చెప్పారు. అదృష్టం కొద్దీ అతడి లివర్ తన కూతురికి మ్యాచ్ అవడంతో వైద్యులు ఆపరేషన్ ఖర్చులు చూసుకోమని చెప్పారు. దీంతో నిర్ఘాంతపోయిన బైజూ కనపడిన వారందర్నీ సాయం కోసం అర్థించాడు. అయినా ఫలితం లేకపోయింది. అనంతరం ఆస్పత్రి సిబ్బంది క్రౌడ్ ఫండింగ్ గురించి వివరించడంతో చివరికి తన కూతురి ప్రాణాలను దక్కించుకున్నాడు.
‘వైద్యులు నా కూతురి పరిస్థితి చెప్పేసరికి చాలా భయపడ్డా. తర్వాత కనపడిన వారందర్నీ సాయం అడిగినా ఫలితం లేకపోయింది. నేను పూర్తిగా ఆశలు వదులుకున్నా. ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడే ఆస్పత్రిలో ఏడుస్తుండగా సిబ్బంది ‘క్రౌడ్ ఫండింగ్’ గురించి చెప్పారు. అదేంటో అప్పటివరకూ నాకు తెలీదు. దాంతో ‘మిలాప్ క్రౌడ్ ఫండింగ్’ వారిని సంప్రదించాను. ఆన్లైన్ ద్వారా వాళ్లు విరాళాలు సేకరించారు. పదిరోజుల్లోనే విశేషమైన స్పందన వచ్చింది. రూ.11,81,325 నగదు జమ అయింది’ అని బైజూ వివరించారు.
అనంతరం రాష్ట్ర సామాజిక భద్రతా మిషన్ నుంచి మరో రూ.10లక్షలు సాయం అందాయని, దాంతో కొచీలోని ఆస్టర్ మెడిసిటీ ఆస్పత్రిలో మే తొలి వారంలో తన కూతురికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించామని బైజూ చెప్పారు. ఆ వైద్య బిల్లులోనూ ఆస్పత్రి యాజమాన్యం కొంచెం సహాయం చేసిందని తెలిపారు. తర్వాత తన కూతురు 21 రోజులు ఐసీయూలో ఉందని, అలాగే ఇంకో మూడు నెలలు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో అనేక మంది సహాయం చేశారని, అందుకు వారికి రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు. ఆ చిన్నారికి సాయం చేయడానికి భారత్తో పాటు విదేశాల నుంచీ ఎంతో సాయం చేశారని మిలాప్లోని సీనియర్ అధికారి ముబీన్ మొహమద్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర