30 ఏళ్ల తర్వాత ఆమె కాదు అతడు
పొత్తి కడుపులో నొప్పి వస్తుందని ఓ మహిళ ఆస్పత్రికి వెళితే అసలు విషయం బయటపడింది. ఇన్నాళ్లు మహిళగా ఉన్న ఆమె.. ఆమె కాదని అతడని తేలింది. విషయం తెలుసుకున్న బాధితురాలి...
కడుపు నొప్పని వెళితే అసలు విషయం బయటపడింది
కోల్కతా: పొత్తి కడుపులో నొప్పి వస్తోందని ఓ మహిళ ఆస్పత్రికి వెళితే అసలు విషయం బయటపడింది. ఇన్నాళ్లు మహిళగా ఉన్న ఆమె.. ఆమె కాదని అతడని తేలింది. విషయం తెలుసుకున్న బాధితురాలి చెల్లి సంబంధిత వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమె కూడా పురుషుడనే తేలింది. దీంతో వారిద్దరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఆండ్రోజెన్ ఇంటెన్సివిటి సిండ్రోమ్ (ఒక మనిషి జన్యుపరంగా పురుషుడిగాగా పుట్టినా శారీరక లక్షణాలన్నీ మహిళవిగా ఉండటం) కారణంగా ఇలా జన్మించారని తెలిసింది.
కోల్కతాకు చెందిన 30 ఏళ్ల బర్భమ్(సదరు వ్యక్తి) తొమ్మిదేళ్ల క్రితం ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల క్రితం పొత్తి కడుపులో నొప్పి రావడంతో ఆమె నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బయటకు చూడటానికి ఆ వ్యక్తి మహిళగా కనిపిస్తున్నా జన్యుపరంగా మగాడని తేలింది. గొంతు, శారీరక అవయవాలన్నీ మహిళలాగే ఉన్నా.. పుట్టినప్పటి నుంచీ అంతర్గత మహిళలకు ఉండాల్సిన అవయవాలు అభివృద్ధి కాలేదు. అలాగే ఆమెకు జీవితంలో ఎప్పుడూ నెలసరి రాలేదని తెలిసింది. కడుపునొప్పి వస్తోందని ఆస్పత్రిలో చేరితే వైద్య పరీక్షలు నిర్వహించామని, అందులో సదరు వ్యక్తికి వృషణాలు ఉన్నాయని గుర్తించి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించామని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలోనే ఆ వృషణాలకు క్యాన్సర్ సోకిందని వెల్లడించారు.
‘ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి, సుమారు 22 వేల మందిలో ఒకరికి ఇలా జరుగుతుంది. ఆడవారి పుట్టుకకు కారణమయ్యే XX క్రోమోజోమ్లు కాకుండా ఆ వ్యక్తిలో XY క్రోమోజోమ్లు ఉన్నాయి. అయితే, అంతర్గత అవయవాల్లో వృషణాలు అభివృద్ధి జరగకపోవడంతో ఆ వ్యక్తికి మహిళా అవయవాలు ఏర్పడాయి. ప్రస్తుతం కీమో థెరపీ అందిస్తున్నాం, పరిస్థితి నిలకడగానే ఉంది. గతంలో ఆ దంపతులు పిల్లలు కావాలని ప్రయత్నించినా అది కుదరలేదు. మరోవైపు ఆ వ్యక్తికి ఇద్దరు మేనత్తలు ఉన్నారని తెలిసింది. వాళ్లు కూడా ఈ విధంగానే జన్యులోపాలతో జీవిస్తున్నారు. బహుశా ఇది వాళ్ల జన్యువుల్లోనే ఉండి ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆ దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. ఇంతకుముందు భార్య భర్తాల్లా ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండమని వివరిస్తున్నాం’ అని అక్కడి వైద్యులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!