ఇంట్లోకి మొసలి.. జనం పరుగులు

ఉత్తరాఖండ్‌లో జనావాసాల్లోకి వచ్చిన ఓ మొసలి కలకలం సృష్టించింది. ఉదంసింగ్‌ నగర్‌లోని సితారగంజ్‌లో రాత్రిపూట ఓ ఇంట్లోకి మొసలి ప్రవేశించడంతో గుర్తించిన స్థానికులు పరుగులు తీశారు.

Published : 06 Jul 2020 01:33 IST

సితార్‌గంజ్‌: ఉత్తరాఖండ్‌లో జనావాసాల్లోకి వచ్చిన ఓ మొసలి కలకలం సృష్టించింది. ఉదంసింగ్‌ నగర్‌లోని సితారగంజ్‌లో రాత్రిపూట ఓ ఇంట్లోకి మొసలి ప్రవేశించడంతో గుర్తించిన స్థానికులు పరుగులు తీశారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు దాన్ని పట్టుకొని దగ్గరలోని ఓ ఆనకట్టలో వదిలేశారు. స్థానికంగా ఉన్న నదుల్లో నీటి మట్టం పెరగడంతో  మొసళ్లు ఇలా తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయని తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని