తెలంగాణ కరోనా @ 1,924

తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది... 

Updated : 08 Jul 2020 21:50 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది.  గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 1,924 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 29,536కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,933 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ రోజు 992 మంది డిశ్ఛార్జి కాగా, ఇప్పటివరకు 17,279 మంది కోలుకున్నారు. ఈ రోజు చనిపోయిన 11 మందితో కలిపి మొత్తంగా 324 మంది కరోనాతో మృతి చెందారు. 

ఈ రోజు 6,363 శాంపిల్స్‌ను పరీక్షించగా... ఇప్పటివరకు 1,34,801 టెస్టులు జరిగాయి. ఈ రోజు నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,590 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 99 నమోదుకాగా, మేడ్చల్‌ నుంచి 43 వచ్చాయి. మిగిలిన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి... 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని