అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఈఎస్‌ఐ మందులు కొనుగోలులో అవకతవకల కేసులో అరెస్టయిన తెదేపా శాసనసభ ఉపనేత అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను ఏపీ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

Published : 14 Jul 2020 15:07 IST

అమరావతి: ఈఎస్‌ఐ మందులు కొనుగోలులో అవకతవకల కేసులో అరెస్టయిన తెదేపా శాసనసభ ఉపనేత అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలను ఏపీ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.బెయిల్‌ మంజూరు చేయాలంటూ గతంలో అచ్చెన్న దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. మరోవైపు  ఏసీబీ అదుపులో ఉన్న అచ్చెన్నాయుడి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స కోసం తనను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

తెదేపా ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈఎస్‌ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్‌ దర్యాప్తులో తేలింది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. విజిలెన్స్‌ కమిటీ నివేదిక  ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని