Heavy Rains: 2 నెలల్లో 125 అతి భారీవర్షాలు
దేశంలో ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు మధ్య 125 అతి భారీ వర్షాలు కురిశాయని, గత ఐదేళ్లలో ఇవే అత్యధికమని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
దేశంలో సెప్టెంబరు-అక్టోబరు మధ్య నమోదు
గత ఐదేళ్లలో ఇవే అధికం: ఐఎండీ
దిల్లీ: దేశంలో ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు మధ్య 125 అతి భారీ వర్షాలు కురిశాయని, గత ఐదేళ్లలో ఇవే అత్యధికమని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యమవడం, అల్పపీడనాలు అధికంగా ఏర్పడటం, పశ్చిమ ప్రాంతం నుంచి అల్పపీడనాలతో కూడిన అవాంతరాలు చోటుచేసుకోవడమే కారణమని విశ్లేషించింది.
☔ ఉత్తరాఖండ్లో గతనెల 18, 19 తేదీల్లో అనూహ్యంగా కురిసిన అతి భారీ వర్షాల కారణంగా 79 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరులో ఇక్కడ సాధారణంగా 35.3 మి.మీ. వర్షపాతం నమోదవుతుంది. అందుకు భిన్నంగా ఈసారి 203.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
☔ సాధారణంగా అక్టోబరు 15న రుతుపవనాల ఉపసంహరణ చోటుచేసుకుంటుంది. ఈ సారి 25వ తేదీ వరకూ అవి కొనసాగాయి.
☔ దేశంలో జూన్-సెప్టెంబరు మధ్య నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. 1961-2010 సంవత్సరాల దీర్ఘకాల సగటు 88 సెంటీ మీటర్లు కాగా, ఈ ఏడాది 87 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
☔ దేశంలో వరుసగా మూడో ఏడాది కూడా సాధారణ, అంతకంటే ఎక్కువ స్థాయిలో వర్షాలు కురిశాయి.
దక్షిణాదిలో నవంబరులోనూ వర్షాలు
నవంబరు నెలలో కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగానే వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈనెల 11 వరకూ వానలు పడే అవకాశముందని; దీర్ఘకాల సగటుతో పోలిస్తే ఈ వర్షపాతం 122% అధికంగా ఉండొచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ