నవ్వుతూ పలకరించే దంపతులు చనిపోయారని.. ఊరంతా అక్కడికి చేరింది..
అందరితో కలుపుగోలుగా ఉంటూ.. నవ్వుతూ పలకరించే ఆలూమగలు రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిసి ఊరంతా అక్కడకు చేరింది. దహనసంస్కారాలు జరిగేంత వరకూ చుట్టుపక్కల ఏ ఇంట..
ప్రమాదంలో మరణించిన కోకాపేట దంపతులకు వీడ్కోలు
రాజు పిల్లలు చంద్రిక, మణిదీప్
ఈనాడు, హైదరాబాద్ రాయదుర్గం, నార్సింగి, న్యూస్టుడే : అందరితో కలుపుగోలుగా ఉంటూ.. నవ్వుతూ పలకరించే ఆలూమగలు రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిసి ఊరంతా అక్కడకు చేరింది. దహనసంస్కారాలు జరిగేంత వరకూ చుట్టుపక్కల ఏ ఇంట.. పొయ్యి వెలగలేదంటే.. ఆ దంపతులు గ్రామస్థుల మనసులో ఎంతటి ముద్ర వేసుకున్నారనేది అర్థమవుతోంది. సోమవారం మధ్యాహ్నం గండిపేట్ సీబీఐటీ మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కోకాపేట్కు చెందిన దుర్గం రాజు, మౌనిక దంపతులను ఎదురుగా వస్తున్న క్వాలీస్ వాహనం ఢీకొట్టింది. భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించారు. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరి మృతదేహాలను కోకాపేట్లోని నివాసానికి తరలించారు. సోమవారం అర్ధరాత్రి నుంచే కోకాపేట్లోని రాజు నివాసం వద్దకు బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో చేరారు. సాయంత్రం దహన క్రియలు పూర్తయేంత వరకూ.. చుట్టుపక్కల కుటుంబాలన్నీ అక్కడే ఉన్నాయి. కుమారుడు, కోడలు మృతదేహాలు ఇంటికి చేరగానే వృద్ధులైన తల్లిదండ్రుల గుండెలు బాదుకుంటూ విలపించటం అందర్నీ కదిలించింది. సాయంత్రం దంపతుల మృతదేహాలను ఊరేగింపుగా శ్మశానవాటికకు తరలించారు. ఊరంతా కదలి తుది వీడ్కోలు పలికింది.
కోకాపేట్లో రాజు ఇంటి వద్ద బంధువుల రోదనలు
ఇంటికి పెద్దదిక్కు
కోకాపేట్ మధ్యలో అందమైన ఇల్లు. తండ్రి కిష్టయ్య, తల్లి రేణుకమ్మ. ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. రాళ్లు కొట్టి కుటుంబాన్ని పోషించే తండ్రికి చేదోడుగా ఉండేవాడు రాజు. రోజూ ఉదయం 4 గంటలకు నిద్రలేచి పాలు సేకరించటం, ఇల్లిల్లూ తిరిగి పోయటం చేస్తుంటాడు. భార్య మౌనిక నార్సింగిలో పొదుపు సంఘాల గ్రూపు లీడర్గా విధులు నిర్వర్తిస్తోంది. రాజు, మౌనిక దంపతులకు ముగ్గురు పిల్లలు. చంద్రిక(11), మణిదీప్(05), అనీష్(03). ఈ ముసలి తనంలో ఆ పసిపిల్లలను ఎలా పోషించాలో అర్థం కావట్లేదని ఇంట్లో పెద్దలు వాపోయారు. కాంగ్రెస్ నాయకుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆ ముగ్గురు పిల్లల్ని ఇంటర్ వరకూ చదివిస్తానంటూ ముందుకు వచ్చారు.
డ్రైవర్కు రిమాండ్
మద్యం తాగి నిర్లక్షంగా కారు నడిపి దంపతుల మృతికి కారకుడైన క్వాలిస్ డ్రైవర్ సంజీవ(30)ను నార్సింగి పోలీసులు మంగళవారం రిమాండ్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్