Hyderabad: గన్మెన్లు కావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్.. తిరస్కరించిన హైకోర్టు
గన్మెన్లు కావాలన్న తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
హైదరాబాద్: గన్మెన్లు కావాలన్న తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తనకు ప్రాణహాని ఉందని, 4+4 భద్రత కల్పించాలని కోరుతూ ఆయన వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ప్రతి ఒక్కరికి భద్రత కేటాయించడం సాధ్యం కాదన్న ధర్మాసనం.. శ్రీనివాస్ గౌడ్కు గన్మెన్లు అవసరమా? లేదా ? అనే విషయాన్ని తెలియజేయాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
పండుటాకులే ఎండగడతాయి జగన్!
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
-
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
-
ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!
-
వడదెబ్బ చికిత్సలకు.. హీట్స్ట్రోక్ క్లినిక్లు
-
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది