గుడ్న్యూస్: రైళ్లలో ఆ సేవలు మళ్లీ ప్రారంభం
ప్రయాణికులకు గుడ్న్యూస్. రైల్వే ప్రయాణికులకు ఆహారం అందించే ఈ- కేటరింగ్ సేవలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. కొవిడ్-19 కారణంగా నిలిచిపోయిన ఈ సేవలను వచ్చే నెల నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ శుక్రవారం....
దిల్లీ: ప్రయాణికులకు గుడ్న్యూస్. రైల్వే ప్రయాణికులకు ఆహారం అందించే ఈ- కేటరింగ్ సేవలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. కొవిడ్-19 కారణంగా నిలిచిపోయిన ఈ సేవలను వచ్చే నెల నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి నుంచి ఈ సేవలు దశలవారీగా అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. తొలుత 30 రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.
ప్రయాణికులు తాము కోరుకున్న స్టేషన్లలో కోరుకున్న ఆహారాన్ని సీట్ల వద్దకే అందించే కేటరింగ్ సేవలను ఐఆర్సీటీసీ 2014లో ప్రారంభించింది. కొవిడ్-19 ముందు రోజుకు 20వేల ఆర్డర్లు వచ్చేవి. దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా ఈ సేవలను మార్చి 22న నిలిపివేశారు. కొన్ని నెలలుగా ప్రత్యేక రైళ్ల పేరుతో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ-కేటరింగ్ సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో రైల్వేమంత్రిత్వ శాఖ అనుమతితో ఈ సేవలు ప్రారంభించనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. www.ecatering.irctc.com వెబ్సైట్ ద్వారా గానీ, 1323 నంబర్కు కాల్చేయడం ద్వారా గానీ, ఐఆర్సీటీసీ ‘ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్’ ద్వారా గానీ ఈ సేవలను పొందొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కూడా అందిస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది.
ఇవీ చదవండి..
అన్ని మెసెంజర్లు ఒకే దాంట్లో!
‘కరోడ్పత్నీస్’.. ఈ సారి వాళ్లదే హవా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్