వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం బుల్లి గది
కరోనా కారణంగా ఆఫీస్కు వెళ్లలేని పరిస్థితుల్లో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇంట్లోనే చక్కగా పనిచేసుకోవచ్చు అనుకుంటారు. కానీ కుటుంబసభ్యులతో కలిసుండే వారికి అది అంత సులువు కాదు. చిన్న పిల్లల అల్లరి, టీవీ, ఇంటి బయట
(పియా లివింగ్ ఫేస్బుక్)
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కారణంగా ఆఫీస్కు వెళ్లలేని పరిస్థితుల్లో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇంట్లోనే చక్కగా పనిచేసుకోవచ్చు అనుకుంటారు. కానీ కుటుంబ సభ్యులతో కలిసుండే వారికి అది అంత సులువు కాదు. చిన్న పిల్లల అల్లరి, టీవీ, ఇంటి బయట వాహనాల శబ్దాలు చికాకు పుట్టిస్తాయి. దీంతో ఉద్యోగి పనిపై దృష్టి సారించలేడు. ఓ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నా.. చాలా వరకు శబ్దాలు వినిపిస్తుంటాయి. దీనికి పరిష్కారంగా జపాన్లోని ఓ కంపెనీ వినూత్న ఆలోచన చేసింది. శబ్దాలు వినిపించకుండా సౌండ్ప్రూఫింగ్తో చిన్న గదులను తయారు చేస్తోంది.
జపాన్లోని పియా లివింగ్ అనే సంస్థ ఈ సౌండ్ప్రూఫింగ్ ‘ఒటెగారూమ్’లను అందుబాటులోకి తెచ్చింది. సాండ్విచ్డ్ బోర్డులతో తయారు చేసిన ఈ చిన్న గదిలో బయటి శబ్దాలు లోనికి అస్సలు వినిపించవు. ఇందుకోసం బోర్డులను ప్రత్యేక విధానంలో గోడలుగా అమర్చారు. 194 సెం.మీ ఎత్తు, 91.5 x 121సెం.మీ విస్తీర్ణం గల ఈ గదిలో ఎల్ఈడీ లైట్స్, కంప్యూటర్/లాప్ట్యాప్ పెట్టుకోవడానికి డెస్క్, కూర్చోవడానికి సరిపడా స్థలం ఉంటుంది. అలాగే ఛార్జింగ్ కోసం వైర్ పెట్టుకోవడానికి గోడల్లో కన్నాలు ఉంటాయి. గాలి సరఫరా కోసం వెంటిలేటషన్ ఫ్యాన్ ఉంటుంది. కేవలం 50కిలోల బరువు ఉంటే ఈ బుల్లి గదిని ఒకరి సాయంతో ఇంట్లో ఎక్కడైనా అమర్చుకోవచ్చట. దీని ధర 1,98,000 యెన్లు(దాదాపు రూ.1.37లక్షలు). ప్రస్తుతం ఆంటిక్ వైట్, బిట్టర్ బ్రౌన్ రంగుల్లో ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. మన దేశానికి డెలివరీ చేస్తారో లేదో తెలియదు గానీ.. జపాన్లో వీటికి ఆదరణ బాగానే లభిస్తోందట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్