Maha Shivaratri: శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు
భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
వైభవంగా రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు
ఇంటర్నెట్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, గంగుల కమలాకర్ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కొమురవెల్లి పురవీధుల్లో మల్లన్న ఊరేగింపు సేవ జరగనుంది. కీసరలో మహాశివరాత్రి వేడుకల ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఏపీలోని శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు నిండిపోయాయి. ఉచిత దర్శనానికి ఆరు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పాతాళగంగలో నీటిమట్టం తగ్గడంతో జల్లు స్నానానికి ఏర్పాట్లు చేశారు. మరోవైపు మల్లన్నకు ఎనిమిదో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులుదీరారు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలు రద్దు చేశారు.
మరో ప్రముఖ క్షేత్రం కోటప్పకొండలో మహాశివరాత్రి తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరుగుతోంది. త్రికోటేశ్వరుడికి తొలిపూజలో తిరునాళ్లు ప్రారంభమైంది. స్వామివారి దర్శనానికి భక్తులు బారులుదీరారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. కృష్ణా జిల్లా పెద్దకల్లెపల్లిలో దుర్గా నాగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడ కృష్ణా నది ఉత్తర వాహినిగా ప్రవహించే నది ఒడ్డున భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. అనంతపురంలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా పూజలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!